'బంగారి బాలరాజు' 2వ పాట 3వ పాట విడుదల

  • IndiaGlitz, [Tuesday,May 15 2018]

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'బంగారి బాలరాజు'.

ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారు విడుదల చేయగా, రెండవ పాటను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గారు విడుదల చేశారు.

ఈ సందర్భంగా అనిల్ గారు మాట్లాడుతూ... బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని రెండవ పాటను నా చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు దర్శకుడైన కోటేంద్ర చాలాకాలం మా టీం లో వర్క్ చేశాడు.

తనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ నాకు బాగా తెలుసు. కోటేంద్ర ఖచ్చితంగా ఈ సినిమాను సక్సెస్ చేస్తాడని అన్నారు. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్ మీద మరెన్నో సినిమాలు రావాలని, మూవీ టీం కు బెస్ట్ విషెష్ అందించారు.

ఈ సందర్భంగా అశ్వనీదత్ గారు మాట్లాడుతూ... బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని అమ్మ మీద రాసిన పాటను విడుదల చేయడం జరిగింది. అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. అని హీరో హీరోయిన్ లకు మరియు మూవీ యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ.. “బంగారి బాలరాజు ఆడియోలోని రెండవ పాటను అనిల్ సుంకర గారు విడుదల చేయడం చాలా సంతోషం ఉంది. అనిల్ సర్ మా ఈ సినిమాకు అండగా ఉండడం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాటను గీతామాధురి పాడగా, శాంతాబాయి సాంగ్ ఫేం మరాఠీ సెన్సేషనల్ హాట్ బ్యూటీ రాధికా పాటిల్ ఐటెంసాంగ్ తో అలరించింది.

అలాగే ఈ సందర్బంగా అనిల్ సర్ కు యూనిట్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.అమ్మ ప్రేమను తెలియజేసే విధంగా రూపొందిన మూడవ పాట ను అశ్వనీదత్ గారు విడుదల చేయడం హ్యాపీగా ఉంది. శ్రీ కృష్ణ పాడిన ఈ పాట తప్పకుండా అందరికి నచ్చుతుందని అన్నారు.

More News

'కాశి' ఓ అందమైన ప్రేమకథా చిత్రం

విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం "కాశి". విజయ్ ఆంటోనీ సరసన అంజలి, సునైన కథానాయికలుగా నటిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మల్టీస్టార‌ర్‌లో కీర్తి

బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

మ‌హేశ్ ద‌ర్శ‌కుడితో శ‌ర్వా

మోస్ట్ వాంటెడ్ టాలీవుడ్ హీరోల్లో శ‌ర్వానంద్ ఒక‌రు. సినిమాల ఎంపిక‌లో అచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటున్న శ‌ర్వానంద్‌.. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నాడు.

నిఖిల్‌తో లావ‌ణ్య‌...

త‌మిళ చిత్రం 'క‌ణిద‌న్‌'ను తెలుగులో 'ముద్ర‌' పేరుతో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. టి.ఎన్‌.సంతోశ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ తెర‌కెక్కుతోంది.

ఈ నెల 18 వస్తున్న'గీతా పురి కాలనీ'

నరేన్, శ్రవణ్, పార్థు, దుష్యంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'గీతాపురికాలనీ'. గర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్  దర్శకుడు.