అమెరికా ఓహియో ఇంటర్ నేషనల్ ఫిలిం పెస్టివల్ లో ఉత్తమ నటుడిగా 'రక్తం' కు గానూ నామినేట్ అయిన బెనర్జీ!

  • IndiaGlitz, [Monday,July 24 2017]

తెలుగు సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు అంటే అంతంత మాత్ర‌మే. అదీ అమెరిక‌న్ ఫిలిం పెస్టివ‌ల్స్ లో అవార్డులు కొల్ల‌గొట్ట‌డం అంటే చిన్ని విష‌యం కాదు. ప్ర‌పంచ న‌లుమూల దేశాల నుంచి వ‌చ్చే సినిమాలకు పోటీగా ఎదురెళ్ల‌డమే అసాధార‌ణ విష‌యం. వంద‌లాది సినిమాలు. వేటిక‌వే ప్ర‌త్యేక‌మైన క‌థ‌లు..ఇన్నో వేటివ్ థాట్స్. వాటి వెనుక ఎన్నో బ్రెయిన్స్. స్ర్కూట్నీ ట‌ఫ్ గా ఉంటుంది. జ్యూరీ టీమ్ కే ఆ సెల‌క్ష‌న్ అనేది ఓ స‌వాల్. అంత‌టి పోటీని సైతం త‌ట్టుకుని అమెరికాలో మ‌న‌ జాతీయ‌ జెండాను రెప‌రెప‌లాడించిన తెలుగు చిత్రం 'ర‌క్తం'.
సీనియ‌ర్ న‌టుడు బెన‌ర్జీ ప్ర‌ధాన పాత్ర లో రాజేష్ ట‌చ్ రివ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ర‌క్తం' చిత్రానికి అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ అమెరికా ఇండీ గేద‌రింగ్ ఫారిన్ డ్రామా ఫీచ‌ర్స్ సెగ్మెంట్ లో (2017) ఇటీవ‌ల అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఇదే ఫిలిం పెస్టివ‌ల్ లో మ‌రో ఐదు అవార్డుల‌ను సైతం ఎగ‌రేసుకుపోవ‌డానికి 'ర‌క్తం' రెడీ అవుతోంది. ఇదే ఫిలిం ఫెస్టివల్ లో మొత్తం ఐదు విభాగాల్లో 'ర‌క్తం' నామినేట్ అయింది.
ఆ వివ‌రాలివి...
1) ఉత్త‌మ న‌టుడిగా: బెన‌ర్జీ
2) ఉత్త‌మ న‌టిగా: మ‌ధు శాలిని
3) ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా: రాజేష్ ట‌చ్ రివ‌ర్
4)ఉత్త‌మ ఛాయాగ్రాహ‌కుడిగా: రామ్ తుల‌సి
5)ఉత్త‌మ నిర్మాతలు గా: సునీత కృష్ణ‌న్ , మునిషీ రైజ్ అహ్మ‌ద్ 'ర‌క్తం' సినిమాకు గానూ నామినేట్ అయ్యారు.
న‌క్స‌లైట్ బ్యాక్ డ్రాప్ లో హింసాత్మ‌క మార్గంలోనే నైతిక విలువ‌లు గురించిన చెప్పిన సినిమా ఇది. ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించిన సీనియ‌ర్ న‌టుడు బెన‌ర్జీ న‌ట‌న‌కు తెలుగు ప్ర‌జ‌ల నుంచి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అలాగే ఇటు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు, క్రిటిక్స్ బెన‌ర్జీ న‌ట‌న‌ను కొనియాడారు.

More News

అక్టోబర్ 13న విడుదలకానున్న 'రాజుగారి గది 2'

కింగ్ నాగార్జున కథానాయకుడిగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ థ్రిల్లర్ "రాజుగారి గది 2".

హ్యాపీ బర్త్ డే టు యూనిక్ స్టార్ విజయ్ ఆంటోని

సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విజయ్ ఆంటోని తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాకు అద్భుతమైన సంగీతానందించారు. మ్యూజిక్ డైరెక్టర్గా, దర్శకుడిగా, సింగర్గా, యాక్టర్గా, నిర్మాతగా ఇప్పుడు అన్ని రంగాల్లో తనదైన శైళిలో రాణిస్తున్నారు.

'ఫిదా' టీమ్ ను అభినందించిన సీఎం కె.సి.ఆర్

వరుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఫిదా`.

పీతపై సినిమా

ఈగ సినిమాతో రాజమౌళి ఈగకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాడు. గతంలో పాము, ఏనుగు వంటి ఎన్నోజంతువులపై సినిమాలు వచ్చి సక్సెస్ అయ్యాయి. అయితే విజువల్ వండర్గా వచ్చిన ఈగ సినిమా మంచి క్రేజ్ను సంపాదించుకుంది.

శర్వానంద్ తో సాయిపల్లవి

రన్రాజారన్, ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి వరుస విజయవంతమైన చిత్రాల్లో నటించిన శర్వానంద్ హీరోగా బాహుబలి వంటి విజువల్ వండర్తో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన ఆర్కా మీడియా అధినేతలు, నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ.