Balapur Laddu Auction: బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం.. పాత రికార్డులన్నీ బ్రేక్, ఎంతో తెలుసా.??

  • IndiaGlitz, [Friday,September 09 2022]

హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో భాగ్యనగరానికే ప్రత్యేకమైన బాలాపూర్ లడ్డూకి వేలంలో రికార్డు ధర దక్కింది. శుక్రవారం జరిగిన వేలం పాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.18.90 లక్షలు పలకగా.. ఈ ఏడాది మరో 5.70 లక్షలు అధికంగా పలికింది.

వేలం కోసం తరలివచ్చిన మంత్రులు, ప్రముఖులు:

ఈ ఏడాది లడ్డూ వేలం పాటలో 13 మంది పాత సభ్యులు, 8 మంది కొత్తవారు పాల్గొన్నారు. రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా వేలం పాటలో పాల్గొన్నారు. స్వయంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం వేలానికి హాజరయ్యారు. గణేశుడి లడ్డూని దక్కించుకోవడం పట్ల వంగేటి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూడు రోజులు తమ ఇంట్లో పూజలు నిర్వహించిన అనంతరం బంధువులు, మిత్రులకు లడ్డూ ప్రసాదాన్ని పంచుతానని లక్ష్మారెడ్డి తెలిపారు.

1994లో లడ్డూ ధర రూ.450

ఇకపోతే.. 2019లో బాలాపూర్ లడ్డూ రూ.17.60 లక్షల పలకగా.. 2020లో కోవిడ్ కారణంగా వేలం పాట జరగలేదు. దానిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా అందజేశారు. మళ్లీ 2021లో రూ.18.90 లక్షలు పలకగా.. మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్‌లు వేలంలో లడ్డూని దక్కించుకున్నారు. 1994లో తొలిసారి బాలాపూర్ గణేశ్ లడ్డూని వేలం వేశారు. ఆ ఏడాది రూ.450కి కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి దానిని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1995, 98, 2004, 2008లలో ఆయనే దక్కించుకున్నారు.

More News

Munugode ByPoll : విధేయతకు పట్టం.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి బరిలోకి దిగుతున్నారు.

యాక్ట్ చేస్తూ బతకడం రాదు.. కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడ్డ రేవంత్

నిన్నటి ఎపిసోడ్‌లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రాసెస్ ముగిసింది. మొదటి వారం నామినేషన్స్‌లో అత్యధికంగా ఓట్లు ఉన్న రేవంత్‌, చంటి, శ్రీసత్య, ఫైమాలు, ట్రాష్ ద్వారా వచ్చిన ఇనయా,

Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూత.. 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పాలించిన "మహారాజ్ఞి"

బ్రిటన్ రాజకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. ఆమె వయసు 96 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో క్వీన్ గురువారం రాత్రి

Divyavani : ఈటల రాజేందర్‌తో దివ్యవాణి భేటీ.. త్వరలో బీజేపీలోకి, సౌత్‌లో ఎక్కడైనా రెడీ అంటూ సంకేతాలు

అలనాటి సినీనటి దివ్యవాణి గురువారం తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈరోజు హైదరాబాద్ శామీర్‌పేట్‌లోని

ఫిలిం ఛాంబర్ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తా: నట్టి కుమార్

తన యాభై ఏళ్ళ జీవన ప్రయాణంలో దాదాపు 30 ఏళ్ళ పాటు సినీరంగంలోనే కొనసాగుతూ వస్తున్నానని ప్ర‌ముఖ నిర్మాత న‌ట్టికుమార్ వెల్లడించారు. గురువారం త‌న 50వ పుట్టిన‌రోజును పురసరించుకుని