బాబాయ్ బాలయ్య తో పోటీకి రెఢీ అంటున్న అబ్బాయ్ ఎన్టీఆర్...

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ డైరెక్ట‌ర్ శ్రీవాస్ తో క‌ల‌సి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.ఈనెల 20న ఆడియోను, సంక్రాంతికి కానుక‌గా జ‌న‌వ‌రి 14న డిక్టేట‌ర్ మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...నంద‌మూరి హీరో ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

స్పెయిన్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న నాన్న‌కు ప్రేమ‌తో...చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ చేస్తున్న‌ట్టు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ ఎనౌన్స్ చేసారు. ఒక రోజు గ్యాప్ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండ‌డం, అదీ..నంద‌మూరి హీరోల సినిమాలు కావ‌డం విశేషం. మ‌రి...బాబాయ్ బాల‌య్య‌తో పోటీకి రెఢీ అని అబ్బాయ్ ఎన్టీఆర్ అన‌డంతో సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ వేడెక్కుతుంది. మ‌రి..ఈ.. నంద‌మూరి హీరోల పోటీలో బాబాయ్ బాల‌య్య గెలుస్తాడా..? అబ్బాయ్ ఎన్టీఆర్ గెలుస్లాడా తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

డిసెంబర్ 25న విడుదలవుతున్న 'జత కలిసే'

అశ్విన్,తేజస్వి హీరో హీరోయిన్లుగా వారాహి చలన చిత్రం,ఓక్ ఎంటర్ టైన్మెంట్స్,యుక్త క్రియేషన్స్ బ్యానర్స్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న చిత్రం 'జత కలిసే'.

నెక్ట్స్ ఇయర్ పక్కా ప్లాన్ లో చరణ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ సినిమా తని ఓరువన్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

నాన్నకు ప్రేమతో...రిలీజ్ డేట్ ఫిక్స్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ నాన్నకు ప్రేమతో...ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు.బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

'లోఫర్' సెన్సార్ పూర్తి..

సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై. లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్ పతాకంపై సి.వి.రావు,శ్వేతలానా,వరుణ్,తేజ నిర్మిస్తున్న భారీ చిత్రం 'లోఫర్'.

జనవరి1న 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని నిర్మించిన చిత్రం'లచ్చిందేవికి ఓ లెక్కుంది'