హీరోయిన్ కోసం గెస్ట్ గా బాలయ్య...

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

హీరోయిన్ కోసం గెస్ట్ గా వ‌స్తున్నాడు బాల‌య్య‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? నిషా క‌ళ్ల త్రిష‌. గోవి ద‌ర్శ‌క‌త్వంలో త్రిష న‌టిస్తున్న ద్విభాషా చిత్రం నాయ‌కి. ఈ చిత్రాన్ని గిరిధ‌ర్ మామిడిప‌ల్లి నిర్మిస్తున్నారు. ఫ‌స్ట్ టైం త్రిష హ‌ర్ర‌ర్ మూవీలో న‌టించ‌డం ఓ విశేష‌మైతే..ఈ సినిమా కోసం ఫ‌స్ట్ టైం సింగ‌ర్ గా మారి త్రిష ఓ పాట‌ పాడ‌డం మ‌రో విశేషం. త్రిష పాడిన పాట‌ను ఇటీవ‌ల పూరి జ‌గ‌న్నాథ్ రిలీజ్ చేసారు. ఈ పాట‌కు విశేష స్పంద‌న ల‌భిస్తుంది.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. త్రిష బాల‌కృష్ణ‌తో క‌ల‌సి ల‌య‌న్ సినిమాలో న‌టించింది. అందుక‌నే అనుకుంట త‌న హీరోయిన్ త్రిష కోసం బాల‌య్య ఈనెల 19న జ‌రిగే నాయ‌కి ఆడియో వేడుక‌కు ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నారు. నాయ‌కి ఇప్ప‌టికే మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకుంది. ఇక ఇప్పుడు బాల‌య్య చేతుల మీదుగా నాయ‌కి ఆడియో రిలీజ్ అయితే మ‌రింత క్రేజ్ ఏర్ప‌డం ఖాయం. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో ఒకేసారి మే నెల‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.