సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా బాలయ్య ఇల్లు!

  • IndiaGlitz, [Saturday,February 27 2021]

సినీ ఇండస్ట్రీలో ఎవరేం చేసినా విచిత్రమే. వారికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ప్రజలకు ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం నటరత్న నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తాజాగా బాలయ్య ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయం ఆయన అభిమానులతో పాటు ఇతర ప్రజానీకానికి చాలా ఆసక్తికరంగా మారింది. ఎక్కడ తీసుకున్నారు? ఎంతకు తీసుకున్నారు? ఎవరి పేరు మీద కొన్నారు? అంటూ సోషల్ మీడియా జోరుగా చర్చ నడుస్తోంది.

నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తాజాగా ఓ ఇంటిని కొనుగోలు చేశారు. జూబ్లీహిల్స్‌ అంటేనే అత్యంత ఖరీదైన ప్రాంత్రం. ఆ ప్రాంతానికి చెందిన ఖరీదైన ప్రాంతమైన రోడ్ నంబర్ 1లో రూ.15 కోట్లకు ఓ ఇంటిని ఈ నెల 11వ తేదీన బాలయ్య కొనుగోలు చేశారని సమాచారం. రెండంతస్థులు కలిగిన ఆ ఇంటిని బాలయ్య తన భార్య వసుంధర పేరు మీద రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. 9,395 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ ఇల్లు ఉన్నట్టు సమాచారం.

ఆ ఇంటి కోసం బాలయ్య రూ. 7.5లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు, రూ. 82.5లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మనీ కంట్రోల్ అనే ఫైనాన్షియల్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. చాలా ఖరీదైన ఈ ఇంటి కోసం బాలకృష్ణ గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నారని సమాచారం. మరోవైపు బాలయ్య సినిమాల్లో సైతం బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను రూపొందిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్‌లో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'గాడ్‌ఫాదర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం.