బాల‌కృష్ణ‌తో మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్రం

  • IndiaGlitz, [Monday,July 02 2018]

'శ్రీ‌మంతుడు', 'జ‌న‌తా గ్యారేజ్‌', 'రంగ‌స్థ‌లం' తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను అందుకున్న సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌. ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ఈ సంస్థ‌.. ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాల‌ను నిర్మిస్తోంది. అలాగే మ‌హేష్ బాబు - సుకుమార్ చిత్రం కూడా ఇదే సంస్థ నిర్మించ‌నుంది. ర‌వితేజతో తెరి రీమేక్‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో డియర్ కామ్రేడ్ కూడా ఇదే సంస్థ నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే.. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో సింహా, లెజెండ్ వంటి వ‌రుస విజ‌యాల త‌రువాత మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.

More News

దేవ‌నార్ స్కూల్‌లో పుట్టిన‌రోజుని సెల‌బ్రేట్ చేసుకున్న హీరోయిన్ శివానీ రాజ‌శేఖ‌ర్

నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా సంతృప్తి కోసం నేను, నా త‌ల్లిదండ్రులు క‌లిసి మ‌న భూమి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన హ‌రిత హారం కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆనందంగా ఉంది.

సత్యదేవ్ - నందితాశ్వేత కాంబినేషన్ లో 'బ్లఫ్ మాస్టర్'

ఆశ, అత్యాశ‌ల నేపథ్యంలో రూపొందిన  'చ‌తురంగ వేట్టై' చిత్రానికి  త‌మిళ  ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇప్పుడీ చిత్రం తెలుగులో రీమేక్ అయ్యింది .

డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలవడం జరిగింది.

'నిన్నుకోరి'కి రివర్స్‌గా చైతు, సామ్ చిత్రం

ఆన్‌స్క్రీన్  మ్యాజిక్ చేసే జంటల్లో నాగచైతన్య, సమంత జోడీ ఒక‌టి. 'ఏ మాయ చేసావే'తో తొలిసారి ప్రేక్షకులను అలరించిన ఈ జంట.. తర్వాత 'మనం', 'ఆటోనగర్ సూర్య' చిత్రాలతో సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు తెచ్చుకుంది.

ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ పాత్ర‌లో జ‌గ్గూ భాయ్‌

యాత్ర పేరుతో మ‌హి .వి.రాఘ‌వ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.