బాల‌య్య వందో సినిమా ఫిక్స్..

  • IndiaGlitz, [Thursday,March 24 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వందో సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. కృష్ణ‌వంశీ - క్రిష్ ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు బాల‌య్య వందో సినిమా డైరెక్ట‌ర్ అని ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం బాల‌య్య వందో సినిమా బాధ్య‌త‌ల‌ను క్రిష్ కి అప్ప‌గించార‌ట‌. బాల‌య్య వందో సినిమాని ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 8న అమ‌రావ‌తిలో ప్ర‌క‌టించ‌నున్నారు.

ఈ చిత్రాన్ని క్రిష్ అత‌ని స్నేహితుడు రాజీవ్ రెడ్డితో క‌ల‌సి నిర్మించ‌నున్నారు. ఏప్రిల్ 22 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి మే నెలాఖ‌రు వ‌ర‌కు ఫ‌స్ట్ షెడ్యూల్ చేయ‌నున్నారు. ఆత‌ర్వాత బాల‌య్య త‌న పుట్టిన‌రోజు (జూన్ 10)ను యు.ఎస్ లో జ‌రుపుకోనున్నారు. విదేశాల నుంచి బాల‌య్య‌ తిరిగి వ‌చ్చిన త‌ర్వాత రెండో షెడ్యూల్ చేయ‌నున్నారు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి క‌థాంశంతో రూపొందే ఈ చిత్రానికి యోధుడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు.