బాల‌య్య‌, క‌ళ్యాణ్ సినిమా ఎప్పుడంటే..

  • IndiaGlitz, [Sunday,April 15 2018]

న‌టసింహ నంద‌మూరి బాలకృష్ణ.. ‘జై సింహా’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల తేజ దర్శకత్వంలో ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని ప్రారంభించిన బాలయ్య.. త్వరలోనే మరో సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌నున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. ఇటీవ‌ల‌ వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాత కళ్యాణ్‌ ‘ఇంటిలిజెంట్’ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. నిర్మాత కళ్యాణ్‌ బాగా నష్టపోయారు.

ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి.. ‘జై సింహా’ నిర్మాత అయిన‌ కళ్యాణ్‌ నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ సినిమాకి కూడా వినాయక్ దర్శకత్వం వహించనుండ‌డం విశేషం. అయితే.. మంచి కథ ఉంటేనే వినాయక్‌తో సినిమా చేస్తానని బాలయ్య చెప్పడంతో.. ఇప్పుడు కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారట వినాయక్. అన్ని కుదిరితే ఈ సినిమాను వచ్చే నెల 12న లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాత కళ్యాణ్‌. కాగా.. ‘యన్.టి.ఆర్’ సినిమా పూర్తయిన తర్వాతే.. వినాయక్ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం.

More News

'నా కథలో నేను' ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసిన స్టార్‌ రైటర్‌ వి.విజయేంద్ర ప్రసాద్‌

సాంబశివ హీరోగా సంతోషి శర్మ హీరోయిన్‌గా జి.ఎస్‌.కె. ప్రొడక్షన్‌ పతాకంపై శివ ప్రసాద్‌ గ్రంధే స్వీయ దర్శకత్వంలో

ఏప్రిల్ 17 నుండి రెండవ షెడ్యూల్ లో 'నివాసి'

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో న‌టించి అంద‌రి హ్రుద‌యాల్లో న‌టుడిగా మంచి స్థానం సంపాయించిన శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా,

'శ్రీ‌నివాస క‌ళ్యాణం'తో అయినా బ్రేక్ అవుతుందా?

యువ కథానాయకుడు నితిన్‌కు పాత టైటిల్స్‌పైన మక్కువ ఎక్కువ.

అప్పుడు రీమేక్‌.. ఇప్పుడు రీమిక్స్‌

యువ కథానాయకుడు నాగ చైతన్య కథానాయకుడిగా, చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ‘సవ్యసాచి’.

ఈ సారైనా విజ‌యం ద‌క్కేనా?

యూత్‌ఫుల్ చిత్రాల దర్శకుడు ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో మెగాహీరో సాయిధరమ్ తేజ్, కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తేజ్‌ ది కూడా ఓ మంచి ప్రేమ కథ’ (ప్రచారంలో ఉన్న పేరు).