డ‌బ్బింగ్ చెప్పుకుంటోన్న బాల‌య్య హీరోయిన్‌...

  • IndiaGlitz, [Saturday,December 02 2017]

ఇప్పుడు తారామ‌ణులంద‌రూ సొంత గొంతుక‌తో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. రాశిఖ‌న్నాలాంటి కొంద‌రు హీరోయిన్స్ అయితే ఏకంగా పాట‌లు కూడా పాడేస్తున్నారు.

ప‌వ‌న్‌తో 'అజ్ఞాత‌వాసి'లో న‌టించిన కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌లు త‌మ పాత్ర‌ల‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. ఇప్పుడు వీరి బాట‌లోకి అడుగు పెట్టింది బాల‌య్య హీరోయిన్ హ‌రిప్రియ‌.

ఈమె బాల‌కృష్ణ 102వ సినిమా 'జైసింహా'లో ముగ్గురు హీరోయిన్స్‌లో ఒక‌రిగా న‌టిస్తుంది. ఇప్పుడు హ‌రిప్రియ త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.