మెజార్టీ రాకపోతే ఏసేస్తా నా...: బాలయ్య

  • IndiaGlitz, [Thursday,April 04 2019]

ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణకు వివాదాలు లేనిదే నిద్ర పట్టేలా లేదు. నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని టీడీపీ అనుకూల మీడియాల్లో ఇలాంటి వార్తలు రానప్పటికీ అందరి మీడియా.. అయిన సోషల్ మీడియాలో మాత్రం బాలయ్య తప్పించుకోలేకపోతున్నారు.

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇక బాలయ్య తన నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడేస్తున్నారు. అసలు తాను ఎన్నికల ప్రచారంలో ఉన్నానా.. ఇంట్లో ఉన్నానా అనేది ఎరుగక నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు. ఇటీవలే ఓ చానెల్‌కు సంబంధించిన మీడియా ప్రతినిధిని కొట్టబోయే అబాసుపాలై క్షమాపణ చెప్పిన విషయం విదితమే.

తాజాగా.. హిందూపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బాలయ్యను చూసిన అభిమాని ఎగిరి గంతేశారు. అంతేకాదు.. సార్ ఈ సారి మీకు 60వేల వరకు మెజార్టీ వస్తుందని గట్టిగా అరిచి చెప్పాడు. ఈ విషయానికి ఆనందంతో పొంగిపోవాల్సిన బాలయ్య.. ఆగ్రహంతో ఊగిపోవడం గమనార్హం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ప్రెస్టేషన్‌‌తో ఉన్నారో.!.

ఇదీ బాలయ్య రియాక్షన్

బాలయ్య అభిమాని మెజార్టీ గురించి మాట్లాడగా ఆయన స్పందిస్తూ..నీ ఇంటి అడ్రస్ చెప్పరా.. నేను నెగ్గాలి నీ సంగతి చెబుతా. మెజార్టీ రాకపోతే నా.... (పీక కోస్తా అన్నట్లు సైగ చేసి) ఏసేస్తా అని బాలయ్య నోరు జారారు. బాలయ్య ఇలా రెచ్చిపోవడంతో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కంగుతిన్నారు. అయితే పక్కనే ఆయన భార్య వసుందర ఈ మాటలు విని నవ్వుకుంటూ ఉండటం గమనార్హం.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను పట్టుకుని ప్రతపక్ష పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇదివరకు అయితే ఏదో మీడియా కదా అని బాలయ్య తిన్నగా క్షమాపణ చెప్పి సైడయ్యారు.. మరి ఈ వ్యవహారం గురించి ఎలా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

More News

మెగాభిమానులు, కార్యకర్తలకు పవన్ షాకింగ్ న్యూస్

జనసేన తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నారని గత కొన్ని రోజులుగా ఈ వార్తలు

ఏపీకి పవన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజ‌లు మార్పు కోరుకుంటున్నారని, 2019 సార్వత్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో జ‌న‌సేన‌, బిఎస్పీ, సిపిఐ, సిపిఎంలతో కూడిన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్

‘సీఎం పదవికి పవన్ అన్ని విధాలా అర్హులు..’

కేంద్రంలో బీఎస్పీ కూట‌మి ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామ‌ని, కేంద్ర ప‌రిధిలోని విభ‌జ‌న హామీల‌న్నీ ప‌రిష్కరిస్తామ‌ని బ‌హుజ‌న

బ్యాంక్‌లో లోన్స్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్...

బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకున్నవారికి ఆర్బీఐ శుభవార్త అందించింది.

అజిత్ పూర్తి చేసేశాడు.. 

త‌మిళ స్టార్ హీరో అజిత్ డిసెంబ‌ర్‌లో బాలీవుడ్ చిత్రం `పింక్‌` రీమేక్ చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేశాడు. ఖాకి ఫేమ్ హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో