బాలయ్య వందో సినిమా లేటెస్ట్ న్యూస్...

  • IndiaGlitz, [Tuesday,March 01 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ వందో సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రు అనే విష‌యం పై గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నవిష‌యం తెలిసిందే.అయితే క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీకి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ప్రారంభించారు. ఇటీవ‌ల బాల‌య్య‌ను కృష్ణ‌వంశీ లేపాక్షి ఉత్స‌వాల్లో కూడా క‌ల‌సి ఈ సినిమా గురించి చ‌ర్చించార‌ట‌.
ఇక ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే....ఈ క్రేజీ మూవీలో నంద‌మూరి హీరో తార‌క‌ర‌త్న ఓ పాత్ర పోషిస్తున్నాడ‌ట‌. అలాగే నారా వారి హీరో నారా రోహిత్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం. అలాగే బాల‌య్య వందో సినిమాలో బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్న న‌టిస్తాడ‌ని గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. సో...మోక్ష‌జ్న కూడా ఈ చిత్రంలో న‌టించ‌వ‌చ్చు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందే ఈ చిత్రం గురించి పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లో అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందర్నీ ఆకట్టుకుంటున్న క్షణం.

భారీ చిత్రాలను నిర్మిస్తున్న పి.వి.పి సంస్థ కోటి రూపాయల బడ్జెట్ తో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ క్షణం.అడవిశేష్,ఆదాశర్మ, అనసూయ భరద్వాజ.

కళ్యాణ్ రామ్ రోల్ ఏంటంటే...

గతేడాది పటాస్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'బంతిపూల జానకి'

ధన్ రాజ్,దీక్షాపంత్,షకలక శంకర్,అదుర్స్ రఘు,వేణు,చమ్మక్ చంద్ర,రాకెట్ రాఘవ,సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం 'బంతిపూల జానకి'.

పవన్ వాయస్ ఓవర్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు,రాజకీయాలే కాకుండా అవేర్ నెస్ కోసం ఓ యాడ్ లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడట.

అందుకే తమన్నా చేస్తుందట...

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తెలుగు,తమిళంలో విడుదల కానున్న ద్విభాషా చిత్రం ఊపిరి విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.