క్రికెట్ ఆడుతున్న బాహుబలి 2 టీమ్..!

  • IndiaGlitz, [Tuesday,August 30 2016]

ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి 2. ఈ చిత్రం కోసం గ‌త కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నారు. ఈరోజు క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రించే ఆఖ‌రి రోజు. అయితే...ఈరోజు ఉద‌యం వ‌ర్షం ప‌డ‌డంతో షూటింగ్ స్పాట్ లోకి వ‌ర్ష‌పు నీరు వ‌చ్చింది. దీంతో ఈరోజు షూటింగ్ ఆగిపోయింది.
ఈ విష‌యాన్ని రాజ‌మౌళి ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేస్తూ....ఈరోజు క్లైమాక్స్ సీన్స్ చిత్రీక‌రించే ఆఖ‌రి రోజు. అయితే...వ‌ర్షం కార‌ణంగా షూటింగ్ స్పాట్ లోకి వ‌ర్ష‌పు నీరు రావ‌డంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో మా టీమ్ షూటింగ్ స్పాట్ ను క్రికెట్ ఆడుకోవ‌డానికి ఉప‌యోగిస్తున్నారు అని తెలియ‌చేసారు. అంతే కాకుండా....త‌న టీమ్ క్రికెట్ ఆడుతున్న వీడియోను కూడా ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న బాహుబ‌లి 2 చిత్రాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేయ‌నున్నారు.