బ‌హుబ‌లి 2 రిలీజ్ డేట్‌

  • IndiaGlitz, [Friday,August 05 2016]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్ లో రూపొందుతోన్న బాహుబ‌లి పార్ట్ 2 బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ 2017 ఏప్రిల్ లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఆర్కా మీడియా బ్యాన‌ర్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవిని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. విడుద‌ల‌కు ముందే బిజినెస్ పరంగా క్రేజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే ఉంది.

ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ 28న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 28తో క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడ‌నేది అనే విష‌యంపై ఆరోజుతో క్లారిటీ వ‌చ్చేస్తుంద‌న్న‌మాట‌. మ‌రి రిలీజ్ త‌ర్వాత బాహుబ‌లి ఎన్ని రికార్డుల‌ను క్రియేట్ చేస్తాడో చూడాలి.

More News

ఎకోఫ్రెండ్లీ ప్రమోషన్స్ లో 'బొమ్మలరామారం'

సినిమా ప్రమోషన్స్ లో కొత్త విధానానికి ఇప్పుడు నిర్మాతలు శ్రీకారం చుడుతున్నారు.

వరుణ్ తేజ్ - శేఖర్ కమ్ముల- దిల్ రాజు చిత్రం షూటింగ్ రేపు ప్రారంభం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్,దర్శకుడు శేఖర్ కమ్ముల,నిర్మాత దిల్ రాజు కలయికలో ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం రూపొందనుంది.

హాట్ టాపిక్ గా మారిన రాజ‌మౌళి రెమ్యూన‌రేష‌న్

ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ఈ సంచ‌ల‌న చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 600 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి చ‌రిత్ర సృష్టించింది. దీంతో బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో..!

తొలిసారి చార్మినార్ ను సందర్శించిన స్టార్ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

ఈనెల‌ 12 న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రం జనతా గ్యారేజ్ . ఎన్టీఆర్ సరసన స‌మంత‌, నిత్యా మీనన్ లు కథానాయికలు గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రఖ్యాత మల‌యాళ నటుడు మోహన్ లాల్  ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.