అజారుద్దీన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ బుధవారం ఉదయం కారు ప్రమాదానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో అజారుద్దీన్ బయటపడినట్టు ఆయన వ్యక్తిగత సహాయకుడు తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం అజారుద్దీన్ రాజస్థాన్ వెళ్లారు.

ఈ క్రమంలోనే ఆయన రణ్‌తంబోర్‌లోని జాతీయ పార్కుకు వెళుతుండగా తను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తిరిగి వస్తుండగా రాజస్థాన్‌లోని సూర్వల్ వద్ద లాల్సాట్-కోట హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు బోల్తా పడింది. ప్రమాద సమయంలో అజార్‌తో పాటు కారులో మరో ముగ్గురు ఉన్నారు. ప్రమాదం నుంచి వెంటనే తేరుకున్న అజారుద్దీన్‌ వేరే కారులో హోటల్‌కు బయలుదేరారు. ఈ ప్రమాదంలో అజార్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

More News

కొత్త సంవత్సరం రోజున రాధేశ్యామ్ టీజర్.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా?

చెర్రీ ఆరోగ్యంపై ఉపాసన ట్వీట్..

మెగా ఫ్యామిలీని కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఒకేరోజు మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

మార్పు.. యూటర్న్‌లు.. న్యూ ఇయర్‌లో కేసీఆర్ 2.0..

2020 ఎండింగ్ తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఊహించని మార్పు తీసుకొచ్చింది. ఆ మార్పు ఎందుకు..? ఏమిటి? అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

భారత్‌లో పెరుగుతున్న యూకే స్ట్రెయిన్ కేసులు..

భారత్‌లో యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్ కల్లోలం రేపుతోంది. ఆరు కేసులతో మొదలైన కరోనా కొ్త్త స్ట్రెయిన్..

అమెరికాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి హత్య..

అమెరికాలో ప్రముఖ ఎన్ఆర్ఐ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ అధికార ప్రతినిధిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.