హాలీవుడ్ మూవీ స్ఫూర్తితో 'అ!'...!

  • IndiaGlitz, [Wednesday,February 07 2018]

నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. అ!' మూవీని సమర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్యా మీన‌న్‌, కాజ‌ల్‌, రెజీనా, ఈషా రెబ్బా, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌.. ఇలా భారీ తారాగ‌ణ‌మే ఉన్న ఈ సినిమా.. ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌తో ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొత్తం ఒక ఫైవ్ స్టార్ హోటల్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. అందుకోసమే కిచెన్ సెట్, రెస్టారెంట్ సెట్ వేసారట. వంట రాని ఓ చెఫ్ (ప్రియ‌ద‌ర్శి) కిచెన్‌లో నానా పాట్లు పడుతూ ఉంటే...అక్కడ ఆక్వేరియంలో ఉన్న ఒక చేప (నాని) ఆ చెఫ్‌కి సలహాలను ఇస్తుందట. వంట చేయడం తనకి ఎలా తెలుసంటే.. ఇంతకు ముందు ఉన్న చెఫ్‌ల‌ను చూసి నేర్చుకున్నానని చెబుతుందట చేప. ఈ తతంగం అంతా చూస్తున్న బోన్సాయ్ మొక్క (ర‌వితేజ‌) ఇద్దరినీ ఆటపట్టిస్తూ ఉంటుందట. ఇలా సరదాగా సాగిపోయే ఈ కథలో రెస్టారెంట్‌లో వచ్చే రకరకాల పాత్రలతో సినిమా ఆసక్తిగా ఉంటుందట.

అయితే ఈ ఐడియా మాత్రం 2007లో వచ్చిన హాలీవుడ్ మూవీ రాటటూలి' నుంచి తీసుకున్నారని కొంతమంది వాదిస్తున్నారు. ఇక్కడ చేప చెఫ్‌కి వంట నేర్పిస్తే...ఆ మూవీలో ఎలుక చెప్తూ ఉంటే వంట చేయడం నేర్చుకుంటాడు చెఫ్. అలాగే హోటల్‌లో రకరకాల పాత్రలతో కొన్ని కథలు సమాంతరంగా సాగుతూ ఉంటాయి. చివరికి అవన్నీ కూడా ఒక చోట చేరుకుంటాయి. మరి ఈ కథని ప్రేరణ పొందారో, లేక కాపీ కొట్టారో తెలియాలంటే ఫిబ్రవరి 16 వరకు వేచి ఉండాల్సిందే. ఈ చిత్రం ద్వారా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

More News

తారక్ , త్రివిక్రమ్ మూవీ డిటైల్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో

మ‌ల‌యాళ టైటిల్ చెప్పిన బ‌న్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు మలయాళంలో కూడా అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ సినిమాలు మలయాళంలో కూడా అనువదింపబడుతూ ఉంటాయి. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కూడా మలయాళంలో డబ్ కానుంది.

గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం నా మనసును కలచివేసింది. - డా.మంచు మోహన్ బాబు

తిరుపతిలో చదువుకునే రోజుల్లో నేనూ, ఆయన ఒకే రూమ్ లో  ఉండేవాళ్ళం. ఆయన బ్రదర్ నా క్లాస్ మేట్. నాకు అత్యంత సన్నిహితుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు. ఎలక్షన్స్ టైం లో ఆయన తరపున ఎన్నోసార్లు ప్రచారానికి కూడా వెళ్ళాను.

నితిన్ హీరోయిన్ మారింది

ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే వంటి చిత్రాలతో స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చిన నితిన్ 25వ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత దిల్‌రాజు నిర్మాత‌గా స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌బోయే 'శ్రీనివాస క‌ల్యాణం'లో న‌టించ‌బోతున్నాడు.

గాయ‌త్రి కోసం తొలిసారిగా..

ప‌ద‌హారేళ్లుగా క‌థానాయిక‌గా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శ‌ర‌న్‌. గతేడాది గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రంలో వ‌శిష్ఠీ దేవిగా అల‌రించిన శ్రియ‌.. ఆ త‌రువాత పైసా వ‌సూల్ చిత్రంలో సంద‌డి చేసింది. ఇక ఈ ఏడాదిలో తొలిగా గాయ‌త్రి చిత్రంతో సంద‌డి చేయ‌నుంది.