పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ‘అతిథి’ హీరోయిన్..

  • IndiaGlitz, [Monday,November 02 2020]

సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన ‘అతిథి’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమృతా రావు ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. అమృతాకావెచ ఆర్‌జే అన్మోల్ దంపతులు పండంటి మగబిడ్డకు స్వాగతం పలికారని.. త‌ల్లి, బిడ్డ ఇద్ద‌రు క్షేమంగా ఉన్నార‌ని తెలిపారు. అభిమానుల అభినందనలు, ఆశీర్వాదాలకు అమృత దంపతులు ధన్యవాదాలు తెలిపారని కుటుంబ సభ్యులు ప్రకటనలో వెల్లడించారు.

అన్మోల్, అమృత దంప‌తులకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఏడేళ్ళ పాటు ప్రేమించుకున్న అనంతరం 2016లో అన్మోల్, అమృత వివాహం చేసుకున్నారు. కాగా గత నెలలో అమృతారావు బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అమృత వెల్లడించింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అతిథి’ సినిమాలో తొలిసారిగా తెలుగు తెరపై అమృతారావు కనిపించింది. ఈ సినిమా తరువాత ఆమె తెలుగు తెరపై తిరిగి కనిపించలేదు. ఈ చిత్రం తర్వాత బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో అమృతారావు నటించింది. ఆమె చివరిసారిగా 2019లో ‘ఠాక్రే’లో జువాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటించింది.

More News

సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబ సభ్యులు

దిశ నిందితుల కుటుంబ సభ్యులు మరోసారి సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో దిశ ఎన్‌కౌంటర్ చిత్రం మరోమారు తెరపైకి వచ్చింది.

తమిళ ‘ఎర్ర’ స్మగ్లర్లు వర్సెస్ కడప లోకల్ గ్యాంగ్.. నలుగురు సజీవ దహనం

తెల్లవారు జామున కడప జిల్లా ఎయిర్ పోర్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ను సుమో ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుమ, రాజీవ్‌ల తనయుడు రోషన్..

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల కుటుంబం నుంచి ఓ యంగ్ హీరో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు.

రేపటి నుంచి ఏపీ, తెలంగాణల మధ్య బస్సులు పున: ప్రారంభం..

తెలుగు రాష్ట్రాల మధ్య నలుగుతున్న అంతరాష్ట్ర బస్సుల సమస్య ఓ కొలిక్కి వచ్చింది.

పోరాట యోధుడు, వీరుడు, శూరుడిని కాపాడిన నాగ్..

టైటిల్ కాస్త వెటకారంగా అనిపిస్తున్నా ఇది మాత్రం నిజమే. హోస్ట్ నాగార్జున ప్రైవేట్ జెట్‌లో వచ్చి మరీ అమ్మ రాజశేఖర్‌ని కాపాడారు.