'ఆర్య' వన్ సైడ్ లవ్ కి 12 ఏళ్లు

  • IndiaGlitz, [Saturday,May 07 2016]

వ‌న్ సైడ్ ల‌వ్‌లోని గొప్ప‌త‌నాన్ని చెబుతూ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త ప్రేమ‌క‌థ‌ని ప‌రిచ‌యం చేసిన చిత్రం 'ఆర్య‌'. క‌థానాయ‌కుడిగా అల్లు అర్జున్‌కి ట‌ర్నింగ్ పాయింట్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా, ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సుకుమార్‌కి శుభారంభాన్నిచ్చిందీ సినిమా. తొలి స‌న్నివేశం నుంచి చివ‌రి స‌న్నివేశం వ‌ర‌కు ఫ్రెష్‌నెస్‌తో ఆడియ‌న్స్‌ని క‌ట్టిప‌డేయాల‌న్న సుకుమార్ త‌ప‌న ఫ్రేమ్ టు ఫ్రేమ్ క‌నిపిస్తుంది కాబ‌ట్టే 'ఆర్య' 2004లో స‌మ్మ‌ర్ సెన్సేష‌న్‌గా నిలిచింది.

ఇక యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్టే. వెస్ట్ర‌న్‌, ఫోక్‌, మెలోడీ, రాక్‌.. ఇలా అన్ని ర‌కాల బాణీల‌తో అల‌రించాడు. ముఖ్యంగా 'అ అంటే అమ‌లా పురం' అనే ప్ర‌త్యేక గీతం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా నిలిచింది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం 2004లో మే 7న రిలీజైంది. అంటే 'ఫీల్ మై ల‌వ్' అంటూ సంద‌డి చేసిన 'ఆర్య‌'కి నేటితో 12 వ‌సంతాలు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌.

More News

డబ్బింగ్ చెబుతున్న 'జెంటిల్ మన్'

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జెంటిల్ మన్'.మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు.'అష్టా చమ్మా' తర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది.

బ్ర‌హ్మోత్స‌వం సాంగ్ మేకింగ్ రిలీజ్...

సూపర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నభారీ చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో నిర్మిస్తుంది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించిన బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను ఈనెల 7న రిలీజ్ చేస్తున్నారు.

బాహుబలి మాయలో కుర్రహీరో

'వినవయ్యా రామయ్య'ఫేమ్ నాగ అన్వేష్ రెండో సినిమాకు రంగం సిద్దమైంది.ఎంతో కాలంగా సరైన కథ కోసం ఎదురుచూసిన అన్వేష్ చివరకు ఓ కథను ఒకే చేసి ఆరు నెలలుగా దాని పై వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

జూన్ మూడ‌వ వారంలో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నజ‌క్క‌న్న టాకీ పూర్తి

వరుసగా విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని సందడి చేస్తున్న సునీల్ హీరోగా... మన్నార్ చోప్రా హీరోయిన్ గా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

అలా చెప్పడం కూడా తప్పేనా - ప్రియమణి

కేరళ లోని లా స్టూడెంట్ జిషాను అత్యాచారం చేసి...ఆతర్వాత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.ఈ ఘటన పై కథానాయిక ప్రియమణి ట్విట్టర్ లో...