మ‌రో తెలుగులో సినిమాలో విల‌న్‌గా అర‌వింద‌స్వామి..?

  • IndiaGlitz, [Thursday,May 07 2020]

అర‌వింద‌స్వామి.. 1980-90 సినిమాల్లో హీరోగా న‌టించి అప్ప‌టి అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయారు. అయితే సినిమా రంగం నుండి ఆయ‌న ఉన్న‌ట్లుండి ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి వెండితెర‌పై రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే కేవ‌లం హీరోగానే సినిమాలు చేస్తాన‌ని కాకుండా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌డానికి కూడా రెడీ అయిపోయారు. త‌మిళంలో విల‌న్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న తెలుగులోనూ ధృవ చిత్రంలో విల‌న్‌గా న‌టించి మెప్పించారు. పాత్ర న‌చ్చితే త‌ప్ప తాను విల‌న్‌గా చేయ‌న‌ని, రొటీన్ విల‌నిజం చేయ‌డానికి తాను ఇష్ట‌ప‌డ‌న‌ని చెప్పేశాడు.

అయితే చాలా ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి అరవింద‌స్వామి విల‌న్‌గా న‌టించ‌బోతున్నార‌ట‌. ఇంత‌కు అర‌వింద‌స్వామి విల‌న్‌గా న‌టించ‌బోయే చిత్ర‌మేదో తెలుసా!. ప్ర‌భాస్ 21వ చిత్రం. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో విల‌న్‌గా అర‌వింద‌స్వామిని అప్రోచ్ అవుతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో సినిమాను భారీ బ‌డ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. మ‌హాన‌టితో నేష‌న‌ల్ అవార్డ్ కొట్టిన నాగ్ అశ్విన్ ఒకప‌క్క‌, మ‌రో ప‌క్క నేష‌న‌ల్ రేంజ్ హీరో ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది.

More News

'జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి' సీక్వెల్

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా, శ్రీదేవి హీరోయిన్‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి’. ఈ సోషియో ఫాంట‌సీ చిత్రం విడుద‌లై

మెగా ఫ్యాన్స్ కోరిక నేర‌వేరేనా?

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు రెండు పెద్ద కోరిక‌లు మిగిలిపోయాయి. అవేంటంటే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించ‌డం, మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోనూ

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌లో భారీ ప్రమాదం.. జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇవాళ తెల్లారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ లీకయ్యింది.

మద్యం అమ్మకాల్లో ఆంధ్రా రికార్డ్ బద్ధలు కొట్టిన తెలంగాణ!

లాక్ డౌన్ 3.0 విధించిన అనంతరం కేంద్రం కొన్ని సడలింపులు చేసిన విషయం విదితమే. ఇందులో మద్యం అమ్మకాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో

ఏపీ పాలనా యంత్రాంగంలో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లోని పాలనా యంత్రాంగంలో కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టూరు. ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకుని సీఎంగా