అరుణ్ ఆదిత్ 'జిగేల్' తొలి షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Tuesday,July 24 2018]

అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం 'జిగేల్'. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాణ సారధ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది.

అరుణ్ ఆదిత్ సరసన జంబ లకిడి పంబ ఫేమ్ సిద్ధి ఇద్నాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్నారు.

దర్శకుడు మల్లి యేలూరి మాట్లాడుతూ.. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతొన్న జిగేల్ తొలి షెడ్యూల్ పూర్తయింది. జులై 30 నుంచి రెండొ షెడ్యూల్ మొదలవుతొంది. ఆగస్ట్ 20 వరకు జరిగే చిత్రీకరణలొ టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది.సెప్టెంబర్ లొ సినిమా టోటల్ షూట్ పూర్తి చెస్తామన్నారు.

చిత్ర నిర్మాత అల్లం నాగార్జున మాట్లాడుతూ.. భారీ తారాగణంతో , కథకు తగ్గ బడ్జెట్ తో తెరకెక్కనున్న హైక్వాలిటీ చిత్రం 'జిగేల్'. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ది బెస్ట్ టీమ్ వర్క్ చెస్తున్నారు. కథే ఈ విత్రానికి ప్రధాన బలం. మా టీమ్ అందరికి మంచి పేరు ను జిగేల్ తీసుకువస్తుందన్నారు.

జయప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్ధి, పోసాని కృష్ణమురళి, సత్య, సత్యం రాజేష్, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వాసు, సంగీతం: మంత్ర ఆనంద్, కథ- కధనం: అల్లం నాగార్జున, మాటలు: అల్లం నాగార్జున, రమేష్ చెప్పాల, పాటలు: రామజొగయ్య శాస్త్రి, ఆర్ట్ : వర్మ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, కొ- డైరక్టర్ : మేడి కె స్వామి, పి.ఆర్.ఓ: సాయి సతీష్. నిర్మాత: అల్లం నాగార్జున, దర్శకత్వం:మల్లి యేలూరి

More News

'వీరభోగ వసంత రాయలు' లో నారా రోహిత్ లుక్..

నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ' వీర భోగ వసంత రాయలు'.. రేపు నారా రోహిత్ బర్త్ డే సందర్భంగా అయన ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేసింది చిత్ర బృందం..

బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న 9వ చిత్రం 'హుషారు'

'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా తన ప్రస్థానం ప్రారంభించిన లక్కీ మీడియా సంస్థ అధినేత బెక్కెం  వేణుగోపాల్ ' మేము వయసుకు వచ్చాం', ' సినిమా చూపిస్త మావ' లాంటి సూపర్ హిట్లు తీశారు.

రిపీట్ చేస్తున్న క్రిష్‌...

డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప్లానింగ్ ప్రకారం చేస్తున్నాడో.. లేక యాదృచ్చికంగా జ‌రుగుతుందో ఏమోకానీ.. ఓ విష‌యాన్ని రిపీట్ చేస్తున్నాడు.

బాలీవుడ్‌లోకి అమ‌లాపాల్‌

నీలి తామ‌ర అనే మ‌ల‌యాళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అమ‌లాపాల్ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీ హీరోయిన్‌గా మారింది.

ప‌దేళ్ల త‌ర్వాత ప్ర‌భాస్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌వుతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.