ప్రభాస్ కి పాడాలని ఉందట‌

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

బాలీవుడ్ టాలెంటెడ్ సింగర్ అర్మాన్ మాలిక్. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బెంగాలీ, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడారు. 2014లో వచ్చిన 'రౌడీ ఫెలో' మూవీలో 'ఏదో' అనే పాటను మొదటిసారిగా తెలుగులో హర్షిక‌తో కలిసి పాడారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'కాటమరాయుడు'(2017)లో 'ఏమో ఏమో' అనే పాటను శ్రేయాఘోషల్ తో కలిసి పాడారు.

తాజాగా.. శంకర్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన‌ '2.O' సినిమాలో కూడా ఒక పాటని పాడారు ఈ గాయకుడు. స్వతహాగా హైదరాబాదుతో అనుబంధం (అమ్మ జ్యోతి.. తెలుగు) ఉండడంతో.. తనకి టాలీవుడ్, హైదరాబాద్ రెండూ కూడా చాలా స్పెషల్ అని చెప్పారు. అలాగే తన మనసులో మాటను చెప్తూ, "నాకు తెలుగు సినిమాల్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది.

ప్రభాస్ సినిమాలో పాడాల‌ని ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు.. ప్ర‌భాస్ కి పాడే అవ‌కాశం రాలేదు. వ‌స్తే వ‌దులుకోలేను" అని అసలు విషయాన్ని బయట పెట్టారు. అనూప్ రూబెన్స్ రాబోయే సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని ఈ సింగర్ దక్కించుకున్నారు. అన్నట్టు 'కాటమరాయుడు' సినిమాకి కూడా అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం విశేషం.