Vyuham: 'వ్యూహం' సినిమా విడుదలపై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్..

  • IndiaGlitz, [Thursday,January 11 2024]

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సినిమా వల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం ఉంటుందనుకుంటే తెలంగాణలో అయినా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు నిర్మాత దాసరి కిరణ్ తరపు న్యాయవాది కోరారు. అయితే ఈ వాదనపై లోకేష్ న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు అన్ని నిబంధనలను పరిశీలించాలకే సెన్సార్ సర్టిఫెకెట్ జారీ చేశామని సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు.

ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'వ్యూహం' సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్సార్ మరణానంతరం, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యారు? అనే అంశాలతో ఆర్జీవీ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమాలో చంద్రబాబు ప్రతిష్టని దెబ్బతీసేలా తెరకెక్కించారనిఈ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. టీఎస్ హైకోర్డును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. ఈ లోపు సెన్సార్ సర్టిఫికెట్ వివరాలను తమ ముందు పొందుపర్చాలని ఆదేశించింది.

తాజాగా దీనిపై విచారణ జరగగా.. వాడివేడిగా వాదనలు జరిగాయి. మూవీ ఎవరినీ కించపరిచేలా లేదని నిర్మాత తరపు న్యాయవాదులు వాదించారు. లోకేష్ తరపు న్యాయవాదులు మాత్రం చంద్రబాబును కించపరిచేలా సన్నివేశాలు తెరకెక్కించారని వాదించారు. సెన్సార్ సర్టిఫికెట్ వివరాలను పరిశీలించిన ధర్మాసనం తీర్పును రేపు వెల్లడిస్తామని తెలిపింది. దీంతో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఆర్జీవీకి అనుకూలంగా తీర్పు వస్తుందా.. లేక టీడీపీకి మద్దతుగా తీర్పు వస్తుందా అనే దానిపై ఇరు వర్గాల్లో టెన్షన్ మొదలైంది. మరి సినిమా విడుదలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో రేపటి వరకు వేచి చూడాలి.

More News

Mudragada: ముద్రగడకు టీడీపీ-జనసేన వల.. మరి 'కాపు' కాస్తారా..?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. రోజురోజుకు పార్టీలు మారే నేతలు ఎక్కువైపోతున్నారు. ఎవరూ ఏ పార్టీలోకి వెళ్తారో తెలియడం లేదు. ఎవరు ఔనన్నా

Guntur Kaaram Making: 'గుంటూరు కారం' మేకింగ్ వీడియో.. మహేష్ ఎనర్జీ మామూలుగా లేదుగా..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎదురుచూస్తున్న క్షణం మరికొన్ని గంటల్లోనే రానుంది. ఇవాళ అర్థరాత్రి ఒంటి గంట నుంచే 'గుంటూరు కారం' మూవీ బెనిఫిట్ షోలు పడనున్నాయి.

MLC By-Elections: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం

Vikram Goud: టీబీజేపీకి విక్రమ్ గౌడ్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక..!

పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కీలక నేత దివంగత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Mohith Reddy: దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ పట్టలేదు.. చంద్రబాబు ఆరోపణలపై మోహిత్ రెడ్డి ఫైర్..

చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు చేర్పించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నిరూపిస్తే నామినేషన్‌ కూడా వేయనని తుడా చైర్మన్, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి