చెర్రీకి నిర్మాతలు ఓకే అయ్యారా?

  • IndiaGlitz, [Thursday,September 17 2015]

ద‌స‌రాకి 'బ్రూస్‌లీ' సినిమాతో సంద‌డి చేయ‌నున్న చ‌ర‌ణ్ నెక్స్‌ట్ మూవీ ఏం చేయ‌బోతాడ‌నేది అప్పుడే అభిమానుల్లో మొద‌లైన ప్రశ్న. రీసెంట్‌గా త‌మిళంలో జ‌యం ర‌వి హీరోగా విడుదలైన 'త‌నీ ఒరువన్' చిత్ర రీమేక్ లో చ‌ర‌ణ్ న‌టిస్తాడ‌నే వార్తలు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ద‌ర్శకుడు, నిర్మాతలెవ‌ర‌నే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్, 'బ్రూస్‌లీ' నిర్మాత డి.వి.వి.దాన‌య్యలు సంయుక్తంగా నిర్మించ‌నున్నార‌నే వార్తలు విన‌ప‌డుతున్నాయి. గ‌తంలో ఎన్‌.వి.ప్రసాద్ నిర్మాత‌గా చ‌ర‌ణ్ స్టార్ట్ చేసిన 'మెరుపు' చిత్రం ఆగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అందుక‌నే చ‌ర‌ణ్ ఈ సినిమాని చేస్తున్నాడన‌డానికి ఈ వార్తలు బలాన్ని చేకూరుస్తున్నాయి.

More News

యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా 'కొలంబస్'

లవర్స్, కేరింత.. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న సుమంత్ అశ్విన్ హీరోగా ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం 'కొలంబస్'.

'చీకటిరాజ్యం' ట్రైలర్ రివ్యూ

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా రాజ్ కమల్ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.స్వెలని దర్శకునిగా పరిచయంచేస్తూ ఎన్.చంద్రహాసన్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం ‘చీకటిరాజ్యం’.

త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడా..?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్... హీరో నితిన్ తో చేస్తున్న‌ సినిమా టైటిల్ అ ఆ.. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభించి..సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రిలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

విష్ణు సరసన అమల...?

మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో నూతన చిత్రం ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన సంగతి విదితమే.

ఒక్కడితో మొదలైంది

భైలుపాటి మోహన్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఒకక్కడితో మోదలైంది సినిమా వచ్చే నెల రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర నిర్మాత బి.మోహన్ తెలిపారు.