పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న అరకు రోడ్ లో...

  • IndiaGlitz, [Monday,August 08 2016]

సాయిరాం శంకర్, నికీషా పటేల్ హీరో, హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ రచన, దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మితున్న చిత్రం "అరకు రోడ్ లో..." ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ " మా చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియో విడుదల చేసి అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. మా చిత్రం అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఒక మంచి చిత్రంగా అందర్నీ ఆకట్టుకుంటుంది" అని అన్నారు.కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా, రచన, దర్శకత్వం : వాసుదేవ్.