బ‌న్నీతో రెహ‌మాన్‌?

  • IndiaGlitz, [Monday,October 16 2017]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రంలో కేర‌ళ‌కుట్టి అను ఇమ్మానియేల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌క‌ద్వ‌యం విశాల్ -శేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ ఓ ద్విభాషా చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థం సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకి డ‌బుల్ ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే.. మెగా ఫ్యామిలీ హీరోల‌తో రెహ‌మాన్ చేసే మూడో చిత్రం ఇదే అవుతుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కొమ‌రం పులి చేసిన రెహ‌మాన్‌.. ప్ర‌స్తుతం చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డి చేస్తున్నాడు. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

More News

శర్వాతో షాలిని?

అర్జున్ రెడ్డితో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామషాలిని పాండే. ప్రీతి పాత్రలో క్యూట్ గా కనిపించి ఆకట్టుకోవడమే కాకుండా.. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది.

'పిఎస్‌వి గ‌రుడవేగ 126.18ఎం' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌

యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్‌. ఈయ‌న క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం 'పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం'.

థ‌మ‌న్ కి మ‌ళ్లీ మంచి రోజులు

ఒక టైంలో యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ హ‌వా బాగానే సాగింది. అయితే ఇటీవ‌ల కాలంలో ఒక‌టీఅరా మిన‌హాయిస్తే థ‌మ‌న్ కెరీర్‌కి ప్ల‌స్ అయిన సినిమాలు లేవు. ఇక థ‌మ‌న్ ప‌ని అయిపోయింది అని అనుకుంటున్న త‌రుణంలో వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో వార్త‌ల్లో నిలిచాడు థ‌మ‌న్‌.

స‌మ‌ర‌సింహారెడ్డి తేదిన వ‌స్తున్న బాల‌య్య‌

నటసింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో స‌మ‌ర‌సింహారెడ్డి ఒక‌టి. ఫ్యాక్ష‌న్ చిత్రాల ట్రెండ్ ఈ చిత్రంతో ఊపందుకుంది. 1999లో జ‌న‌వ‌రి 13న సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా గ‌త రికార్డుల‌ను తిర‌గ‌రాసి చ‌రిత్ర సృష్టించింది అప్ప‌ట్లో.

రామ్ ద‌ర్శ‌కుడితో నాని?

నేను శైల‌జ చిత్రంతో తెలుగు ప‌రిశ్ర‌మ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌. ప్ర‌స్తుతం అదే చిత్ర క‌థానాయ‌కుడు రామ్‌తో ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు.