ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లిగారైన కరీమా బేగం నేడు మృతి చెందారు. చిన్నతనంలోనే రెహ్మాన్ తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతంతా ఆయన మాతృమూర్తే భుజస్కందాలపైకి ఎత్తుకున్నారు. తొమ్మిది సంవత్సరాల వయసులోనే రెహ్మాన్ తండ్రి మరణించడంతో.. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కరీమా బేగం కుటుంబాన్ని పోషించేవారు. రెహ్మాన్‌తో పాటు ముగ్గురు ఆడపిల్లల బాధ్యతను ఆమే తీసుకున్నారు. రెహ్మాన్‌కు 11 సంవత్సరాలు రాగానే.. కుటుంబ బాధ్యతల్లో తల్లికి చేదోడుగా ఉంటూ వచ్చారు.

రెహ్మాన్ తన జీవితాన్ని తల్లి నగలు అమ్మి ప్రారంభించారు. తల్లి నగలు అమ్మగా వచ్చిన డబ్బుతో తన ఇంట్లోనే ఒక అద్భుతమైన స్టూడియోను ప్రారంభించారు. రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులయ్యారు. ఆ సమయంలోనే అంటే 1989లో వీరి కుటుంబం ఇస్లామ్‌ మతంలోకి మారింది.

More News

భారత్‌లో తొలిసారి అందుబాటులోకి డ్రైవర్‌ రహిత రైలు..

భారత్‌లో తొలిసారి డ్రైవర్‌ రహిత రైలు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రోలో డ్రైవర్ రహిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

వైఎస్‌పై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు...

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఎవరో ఒకరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనో..

యాక్ష‌న్ హీరోను ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ చేస్తున్న మారుతి..!

ఓ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే కాకుండా.. సినిమా ముగియ‌గానే కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు

మోదీ గడ్డం వెనుక అసలు కారణం ఇదేనట...

ప్రధాని మోదీ ఇటీవల కొంతకాలంగా తెల్లటి గడ్డంతో మెరిసిపోతున్నారు.

క్రేజీ టైటిల్‌.. స్టార్ ప్రొడ్యూస‌ర్‌తో క‌ల్యాణ్‌రామ్‌..!

ఒక‌వైపు హీరోగా, మ‌రోవైపు నిర్మాత‌గా సినిమా రంగంలో బిజీగా ఉంటున్న వ్య‌క్తి నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌.