ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతున్న నారారోహిత్ 'సావిత్రి'

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై డా.వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాతగా నారారోహిత్ -నందిత కాంబినేషన్ లో వస్తున్నా సావిత్రి'. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా.....

నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ' ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన రోజు నుండి ఆడియెన్స్ లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమా మొత్తం మొత్తం పూర్తయింది. నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల సాయికార్తీక్ అందించిన పాటలు విడుదలయ్యాయి. పాటలకు ఆడియెన్స్ ను మంచి స్పందన వస్తుంది. రోహిత్ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

More News

ఖుషీ సీక్వెల్ గురించి రేణు రియాక్షన్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఎస్.జె.సూర్య కాంబినేషన్లో తాజాగా ఖుషీ సీక్వెల్ రూపొందించనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యిందా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రం ప్ర‌స్తుతం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యింది అంటూ ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

యార్ల‌గ‌డ్డ సుమంత్ సినిమా పూర్త‌య్యింది..

ప్రేమ‌క‌థ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే మంచి న‌టుడు అనిపించుకున్నాడు  అక్కినేని మ‌న‌వ‌డు..నాగార్జున మేన‌ల్లుడు యార్ల‌గ‌డ్డ సుమంత్. ఆత‌ర్వాత స‌త్యం, గౌరి, మ‌ధుమాసం, పౌరుడు, గోల్కండ హైస్కూల్...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించి స‌క్సెస్ సాధించాడు.

క్ష‌ణం బాలీవుడ్ రీమేక్ లో స‌ల్మాన్..

అడ‌వి శేషు హీరోగా నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన చిత్రం క్ష‌ణం. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ పి.వి.పి నిర్మించిన క్ష‌ణం సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.

సూపర్ స్టార్ సూర్య 'మేము' విడుదల వాయిదా!

సూపర్ స్టార్ సూర్య నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన 'పసంగ-2' తెలుగులో 'మేము'