Mogalirekulu Sagar:జనసేన ప్రచార కార్యదర్శిగా 'మొగలిరేకులు' సాగర్ నియామకం

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

ఇటీవల జనసేన పార్టీలో చేరిన 'మొగలిరేకులు' సీరియల్ ఫేమ్ ములుకుంట్ల సాగర్ అలియాస్ ఆర్కే నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా సాగర్‌ను నియమించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సాగర్‌కు నియామక పత్రాన్ని జనసేనాని అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని శానిర్దేశం చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.

ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు పార్టీ తరపున పవన్ కల్యాణ్‌ బీఫారం అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలన్నారు.హోమ్ రూల్ ఉండాలనే ఉద్దేశంతో దశాబ్దకాలం పోటీకి దూరంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరాల్సి ఉందన్నారు. తెలంగాణ సాయుధ నపోరాట స్ఫూర్తి జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోందన్నారు. ఏపీలో అభివృద్ధి జరిగి వలసలు ఆగితేనే తెలంగాణ ఆకాంక్షలు సంపూర్ణం అవుతాయని చెప్పారు. లేదంటే ఇక్కడికి వలసలు పెరిగి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. అందుకే తాను ఏపీపై ప్రత్యేక దృష్టి సారించానని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

గ్రేటర్ హైదరబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు అభ్యర్థిగా వంగా లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం అభ్యర్థిగా మిర్యాల రామక్రిష్ణ, కొత్తగూడెం అభ్యర్థిగా లక్కినేని సురేందర్ రావు, వైరా(ఎస్టీ) నుంచి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట (ఎస్టీ) అభ్యర్థిగా ముయబోయిన ఉమాదేవి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏపీ సెటిలర్ల ఓటర్లు ఉండటం గమానార్హం.

More News

Pindam: అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'పిండం' పాట విడుదల

ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. 'ది స్కేరియస్ట్ ఫిల్మ్' అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు

Sapta Saagaralu Daati: 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' ప్రేక్షకులను మరింత మెప్పిస్తుంది: చిత్ర బృందం

ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన 'సప్త సాగరాలు దాటి సైడ్ ఎ' విశేష ఆదరణ పొందింది. దీంతో 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Game Changer:రికార్డు ధరకు అమ్ముడుపోయిన 'గేమ్‌ ఛేంజర్' మూవీ ఆడియో రైట్స్

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan), పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్‌ల(Shankar) కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్‌’(Game Changer).

KTR:ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం

బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం తప్పింది. ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొన్నారు.

Samantha:అనారోగ్యం, విడాకులు.. ఇలా ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి: సమంత

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు.