close
Choose your channels

Vote Apply:అక్టోబర్ 31 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. అభ్యర్థులు, ప్రజలకు తెలంగాణ సీఈవో సూచనలు

Monday, October 9, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అభ్యర్థులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రయాణాలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో నగదు ఉంటే అందుకు సంబంధించి పూర్తి పత్రాలు, వివరాలు ఉండాలని సూచించారు. అలాగే అభ్యర్థులు ప్రచారం సమయంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్ 1950ని సంప్రదించాలన్నారు.

ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగిచుకోవచ్చు..

అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లో అన్ని కాలమ్స్ తప్పకుండా నింపాలని, లేదంటే తిరస్కరణకు గురవుతుందని హెచ్చరించా. నమూనా, మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగిచుకోవచ్చని చెప్పారు. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. బ్యాలెట్ పత్రాలపై పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయన్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నాయకుల ఫోటోలను తొలగించాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అయితే చిరునామా మార్పు అంశాలు మాత్రం వాయిదా వేస్తున్నట్లు వికాస్ రాజ్ వివరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.