పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసుకున్న'అపార్ట్‌మెంట్‌'

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

శ్రీ క్రియేటివ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నిఖిత ప్రధానపాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ నిర్మించిన సస్పెన్స్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'అపార్ట్‌మెంట్‌'. ఈ చిత్రం ఇటీవలే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ చిత్ర విశేషాలను తెలియజేస్తూ..'ఇదొక సస్పెన్స్‌తో కూడుకున్న మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రం. నిఖిత పాత్ర ఈ చిత్రంలో హైలైట్‌గా ఉంటుంది. అలాగే మిగతా ప్రధాన పాత్రల్లో సంజన, ఉత్తేజ్‌, చిన్నా వంటి వారు ఈ మూవీలో అద్భుతంగా నటించారు. అలాగే మా సంగీత దర్శకులు ఖుద్దూస్‌ ఎస్‌.ఎ. స్వరపరిచిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. రిథమ్‌ స్టూడియోలో ప్రస్తుతం డబ్బింగ్‌, ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్‌లో ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ఆడియోని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నాము. ఆగస్ట్‌ చివరి వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము..అని తెలిపారు.

నిఖిత, సంజన, చిన్నా, ఉత్తేజ్‌, విజయ్‌సాయి, రక్ష, అల్లరి సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఖుద్దూస్‌ ఎస్‌.ఎ., కెమెరా: సాబూ జేమ్స్‌, ఎడిటర్‌: నాగిరెడ్డి, ప్రొడ్యూసర్‌: ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ, కథ-దర్శకత్వం: శివగంగరాజు వుడిమూడి.

More News

సెల్ఫీ రాజా విడుద‌ల తేదీ ఖ‌రారు

అల్ల‌రి న‌రేష్ న‌టించిన‌ తాజా చిత్రం సెల్ఫీ రాజా. ఈ చిత్రాన్ని సిద్ధు ఫ్ర‌మ్ సికాకుళం ఫేం జి.ఈశ్వ‌ర్ రెడ్డి తెర‌కెక్కించారు. ఈ చిత్రాన్ని గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై చ‌ల‌సాని రామ బ్ర‌హ్మాం చౌద‌రి నిర్మించగా... ఎ.కె. ఎంట‌ర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై లిమిటెడ్ బ్యాన‌ర్  పై రామ బ్ర‌హ్మాం సుంక‌ర స‌మ‌ర్పిస్తున్నారు.

జక్కన్న వచ్చేస్తున్నాడు...

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం జక్కన్న.

'బిచ్చగాడు' సక్సెస్ కు కంటెంటే కారణం - చిత్ర నిర్మాతలు

తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని,సత్న టైటస్ జంటగా ఫాతిమా ఆంటోని నిర్మించిన చిత్రం 'పిచ్చైకారన్'.ఈ చిత్రాన్ని తెలుగులో 'బిచ్చగాడు'

మహేష్ డ్యూయెల్ రోల్...?

బ్రహ్మోత్సవం తర్వాత సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి చిత్రం వాస్కోడిగామా(వినపడుతున్న పేరు)కోసం రెడీ అయిపోతున్నాడు.

సినిమాల నుండి సమంత వైదొలుగుతుందా..?

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న స‌మంత రీసెంట్‌గా కూడా అఆ చిత్రంతో కూడా స‌క్సెస్ అందుకుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న జ‌న‌తాగ్యారేజ్‌లో న‌టిస్తుంది.