Odisha Train Accident: ఒడిషా రైలు ప్రమాదం : రెండు రైళ్లలో 120 మంది ఏపీ వాసులు..

  • IndiaGlitz, [Saturday,June 03 2023]

ఒడిషాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగ్ బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మంది మరణించడంతో దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రమాదంతో దేశవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవలికాలంలో ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఈ ప్రమాదంలో మరణించిన, గాయాలైనవారిలో ఒడిషా, బెంగాల్ వాసులే అధిక సంఖ్యలో వున్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, తమిళనాడు వాసులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది.

ప్రమాదం విషయం తెలియగానే కోరమండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లలో రిజర్వేషన్ చేయించుకున్న తమ వారి క్షేమ సమాచారం కోసం ఏపీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో షాలిమార్, సంత్రగచ్చి, బాలేశ్వర్ స్టేషన్‌లలో విజయవాడ వాసులు 47 మంది, రాజమహేంద్రవరం వాసులు 22 మంది, ఏలూరుకు చెందిన ఒకరు ఇలా 70 మంది వరకు వున్నారు. ఇక యశ్వంత్ పూర్ నుంచి హౌరా వెళ్తున్న మరో ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి, రేణిగుంట, చీరాలకు చెందిన 52 మంది ప్రయాణీకులు ఎక్కినట్లుగా తెలుస్తోంది. దీంతో వీరందరి క్షేమ సమాచారంపై బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు ఒడిషా రైలు ప్రమాదంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైల్వే అధికారులతో మాట్లాడి ఏపీకి చెందిన బాధితుల వివరాలను సేకరిస్తున్నామని సీఎం తెలిపారు. అలాగే ఘటనాస్థలికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందాన్ని పంపించారు. కలెక్టరేట్‌లలో హెల్ప్‌లైన్ నెంబర్లు, ఒడిషా సరిహద్దులోని జిల్లాల్లో ఆసుపత్రులను అప్రమత్తం చేయాల్సిందిగా జగన్ ఆదేశించారు.

ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హైల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది.

ఒడిశా ప్రభుత్వం- 06782-262286.
రైల్వే హెల్ప్‌లైన్లు:
హౌరా 033-26382217;
ఖరగ్‌పూర్‌ 8972073925
బాలేశ్వర్‌ 8249591559;
చెన్నై 044-25330952

వాల్తేరు డివిజన్‌..

విశాఖ : 08912 746330, 08912 744619
విజయనగరం : 08922-221202, 08922-221206.

దక్షిణ మధ్య రైల్వే :

సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం (040 27788516)
విజయవాడ రైల్వే స్టేషన్‌ (0866 2576924)
రాజమండ్రి రైల్వే స్టేషన్‌ (0883 2420541)
రేణిగుంట రైల్వే స్టేషన్‌ (9949198414)
తిరుపతి రైల్వే స్టేషన్‌ (7815915571)
నెల్లూరు రైల్వే స్టేషన్‌ (08612342028)

More News

Odisha Train Accident: మాటలకందని మహా విషాదం: ఒడిషాకు మోడీ.. ప్రమాదస్థలిని పరిశీలించనున్న ప్రధాని

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 900 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని..

Sirf Ek Bandaa Kaafi Hai: 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' ట్రైలర్: అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం

అత‌నొక సామాన్యమైన వ్య‌క్తి.. వృత్తి రీత్యా లాయ‌ర్‌. కొన్ని ప‌రిస్థితుల్లో ఓ అసామాన్య‌మైన వ్య‌క్తితో ఓ కేసు ప‌రంగా పోరాటం చేయాల్సి వ‌స్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం

Pawan Kalyan Vaarahi: ఆ రోజు నుండి రోడ్డెక్కనున్న పవన్ వారాహి...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనం వారాహి. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి ద్వారా జనాల్లోకి వెళ్లనున్నారు.

క్యాంటీన్‌లో మిత్రులను ఆటపట్టిస్తూ.. కొండ కోనలను ఎక్కేస్తూ.. కాలేజీ రోజుల్లో కేటీఆర్ ఇలా

కల్వకుంట్ల తారక రామారావు.. షార్ట్ కట్‌లో కేటీఆర్ . ఈయన గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన వారసుడిగా ఆయన రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.

ఆ కల నిజం చేసుకుంటున్నాం.. తెలంగాణ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు శుభాకాంక్షలు: రామ్ చరణ్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.