‘‘ఆచార్య’’ ఇంటికి మంత్రిగారు..!!

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా హైదరాబాదులో బిజిబిజీగా గడుపుతున్నారు. తొలుత ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆమె భేటీఅ అయ్యారు. అనంతరం కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ... రోజాను, ఆమె భర్త సెల్వమణిని, పిల్లలను సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు ఆచార్య మూవీ రిలీజ్ సందర్భంగా రోజా శుభాకాంక్షలు తెలియజేశారు. అటు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు శాలువా కప్పి సత్కరించారు.

కాగా.. మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని పలుమార్లు గుర్తు చేసుకునేవారు రోజా. ఆయనకి తాను అభిమానురాలినని, ఆయనతో నటించడం గొప్ప అనుభూతి అని చెప్పేవారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ తాను.. చిరంజీవి పక్కన అవకాశం వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒకానొక సందర్భంలో ప్రకటించారు. చిరంజీవి సెట్స్‌లో తనను బాగా చూసుకునేవారని రోజా చెప్పారు. ఆయన నటించిన ‘ఆలయ శిఖరం’ సినిమా సెట్స్‌కు వెళ్లి చిరంజీవితో తన చేతిపై ఆటోగ్రాఫ్‌ తీసుకున్నానని రోజా గుర్తుచేసుకున్నారు. అలాంటి తాను ఆయనతో హీరోయిన్‌గా సినిమాలు చేయడాన్ని తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఒక అభిమాని తన అభిమాన హీరో సరసన హీరోయిన్‌గా చేయడం చాలా అరుదని.. కానీ, ఆ అవకాశం తనకు లభించిందని రోజా పలు వేదికలపై చెప్పేవారు.

అంతకుముందు... తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రోజా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం సతీమణి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవితలు సాంప్రదాయ పద్ధతిలో బొట్టు పెట్టి వస్త్రాలు బహూకరించారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికే ప్రగతి భవన్‌కు వచ్చినట్లు తెలిపారు. కేసీఆర్ తనను ఓ కూతురి మాదిరిగా చూస్తారని చెప్పారు.

More News

చిరంజీవి చేతుల మీదుగా ఫిలిం జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ

తెలుగు ఫిలిం జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ (టి.ఎఫ్‌జె.) స‌భ్యులంద‌రికీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డుల‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధానం చేశారు. గురువారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్‌లో

మంత్రి హోదాలో ప్రగతి భవన్‌కు రోజా.. కేసీఆర్‌తో భేటీ, బొట్టుపెట్టి సత్కరించిన సీఎం ఫ్యామిలీ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రోజా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం సతీశణి శోభ,

'సర్కారు వారి పాట', పోకిరి కి మించిన బ్లాక్ బస్టర్ అవుతుంది: మార్తాండ్ కె. వెంకటేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

శ్రీవిష్ణు, కేథ‌రిన్ థ్రెసా 'భళా తందనాన' మే 6న విడుదల

ప్రామిసింగ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం ‘భళా తందనాన’.

టాలీవుడ్‌లో మరో విషాదం.. కరెంట్ షాక్‌తో యువ దర్శకుడు దుర్మరణం

తెలుగు చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఘట్టమనేని రమేష్ బాబు, నారాయణ దాస్ నారంగ్, సీనియర్ నటుడు బాలయ్య తదితరులు మృతిచెందారు.