close
Choose your channels

CM Jagan:సీఎం జగన్ సహా 41 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు

Thursday, November 23, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అసలు ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదని తెలిపారు. రఘురామ కృష్ణంరాజు తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపిస్తూ పిటిషన్ దాఖలు చేయగానే ప్రభుత్వం కొన్ని రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. దీంతో న్యాయస్థానం పిటిషన్‌పై విచారణ చేపడతామని తెలిపింది. దీంతో సీఎం జగన్ సహా 41 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే సీఎం జగన్ బెయిల్ రద్దుపై రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న విచారణ జరగనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని విచారణ వేగవంతం చేయాలన్న రఘురామ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్ కోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఉత్తర్వులను రఘురామ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.

మరోవైపు పదేళ్లుగా నెమ్మదిగా సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని.. విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితే కనిపించట్లేదని తెలిపారు. కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. అలాగే రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ను ఎందుకు విచారించకూడదో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలో జగన్‌, ఎంపీ విజయసాయిరెడ్డి సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment