Tiger Nageswara Rao:టైగర్ నాగేశ్వరరావుకు షాక్.. రిలీజ్ ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్, కారణమిదే

  • IndiaGlitz, [Thursday,August 31 2023]

మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. 1970-80 దశకాల్లో స్టువర్ట్ పురం ప్రాంతంలో నివసించిన టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ జీవిత కథ ఆథారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్, ఫస్ట్ లుక్, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావుకు షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దశాబ్ధాల క్రితం జరిగిన విషయాలపై మళ్లీ సినిమా చేయడం ద్వారా ఒక వర్గాన్ని కించపరచడమేనని న్యాయవాది పృథ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ధర్మాసనం చిత్ర నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామాకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

ఇప్పటికే స్టువర్ట్ పురంలో నివసించే (ఎరుకల) సామాజిక వర్గాన్ని దొంగలుగా చూపించారని.. తమ గ్రామాన్ని నేరగ్రామంగా చిత్రీకరించారని , అభ్యంతరకరమైన పదజాలంతో చూపించారని ఆ వర్గం మండిపడుతోంది, అంతేకాదు.. ఏపీ సినిమాటోగ్రఫి కమీషనర్‌కు, ఏపీ డీజీపీకి కూడా లేఖలు రాశారు. వెంటనే టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు.

ఇకపోతే.. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రేణూ దేశాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవితేజ సరసన గాయత్రి భరద్వాజ్, నూపూర్ సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్, జిషు సేన్ గుప్తాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో టైగర్ నాగేశ్వరరావు విడుదల కానుంది.

More News

ఎంతకు తెగించార్రా.. ఏకంగా సుప్రీంకోర్ట్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్, సీజేఐ జాగ్రత్తలు

కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులు , ప్రముఖులు, వ్యక్తులు, బ్రాండ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు.

కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా .. రేపటికి వాయిదా

దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వారికి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తండ్రీకొడుకులు పాదం మోపారు.. వరుణుడు పారిపోయాడు, సెంటిమెంట్ దెబ్బకు జనం గగ్గోలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు గుర్తుచేసుకుంటే.. ఆయన హైటెక్ పాలనతో పాటు వర్షాలు కూడా గుర్తొస్తాయి. దురదృష్టమో, శాపమో తెలియదు గానీ చంద్రబాబు రాష్ట్ర పగ్గాలు

రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితులు .. ఆ రెండు పాదాల మహిమే : ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. ఆగస్ట్ పోయి సెప్టెంబర్ వస్తున్నా నేటికి సరైన వర్షాలు లేవు. ఎల్ నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని

CM YS Jagan:జగన్‌పై అభిమానం చాటుకున్న విద్యార్ధులు.. రాఖీ ఆకారంలో ముఖ్యమంత్రిపై మమకారం

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా చెప్పుకునే రక్షాబంధన్ పర్వదినాన్ని భారతీయులు ఘనంగా జరుపుకుంటున్నారు.