కత్తి మహేష్ కోసం రూ.17 లక్షలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

  • IndiaGlitz, [Friday,July 02 2021]

గత శనివారం ఉదయం ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు సమీపంలో కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కంటికి, తలకు బలమైన గాయాలయ్యాయి.

నెల్లూరులో చికిత్స అనంతరం కత్తి మహేష్ ని మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. కత్తి మహేష్ కంటికి, తలకు కీలకమైన సర్జరీలు వైద్యులు నిర్వహించారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో కత్తి మహేష్ ఆరోగ్యం ఓ సందర్భంలో విషమంగా కూడా మారింది. ప్రస్తుతం కత్తి మహేష్ ఆరోగ్యం నిలకడగా ఉంది.

సర్జరీల అనంతరం మహేష్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని రోజులపాటు మహేష్ బెడ్ పైనే విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. మహేష్ చికిత్స కోసం భారీగా డబ్బు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కత్తి మహేష్ చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ 17 లక్షల మొత్తాన్ని విడుదల చేసింది.

ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కత్తి మహేష్ కుటుంబంపై ఆర్థిక భారం తగ్గించేదే. వ్యక్తిగతంగా కత్తి మహేష్ సీఎం జగన్ మద్దతు దారుడు. గత ఎన్నికలో వైసిపి తరుపున మహేష్ ప్రచారం కూడా చేశారు. ఫిలిం క్రిటిక్ గ గుర్తింపు పొందిన మహెష్ నటుడిగా కూడా అవకాశాలు అందుకుంటున్నారు.

More News

తనని బ్యాన్ చేసిన ట్విట్టర్ కి పోటీగా 'గెట్టెర్'.. ట్రంపా మజాకా!

అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ ఎంత హంగామా చేశాడో అందరికి తెలిసిందే.

కొత్త పెళ్ళికూతురికి ఈడీ సమన్లు.. హీరోయిన్ పై రూ.1.5 కోట్ల వివాదం!

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే యామి గౌతమ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

కారు ప్రమాదానికి గురైన కన్నడ నటుడి తనయుడు.. బైక్ ని తప్పించబోయి..

ప్రముఖ కన్నడ నటుడు, పొలిటీషియన్ అయిన జగ్గేష్ తనయుడు యతి రాజ్ కారు ప్రమాదానికి గురయ్యారు.

బి గ్రేడ్ నటి, అడుక్కుంటుంది.. తాప్సిపై సంచలన వ్యాఖ్యలు

ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి కోపం వస్తే ఇక అంతే. ఎదుటివారు ఎవరైనా సరే నిప్పులు చెరిగేస్తుంది.

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై రాజమౌళి అసంతృప్తి.. విదేశీయులు ఇలాంటివి చూస్తే..

దర్శకధీరుడు రాజమౌళి చాలా కూల్ గా ఉంటారు. ఎప్పుడూ తన వర్క్ పనే ఫోకస్ పెడతారు.