TTD:టీటీడీ కొత్త పాలక మండలి విడుదల.. 24 మందితో జాబితా , ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం

  • IndiaGlitz, [Saturday,August 26 2023]

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం పాలకమండలి కోసం సుదీర్ఘ సమయం తీసుకుంది. అనేక లెక్కలు, సామాజిక సమీకరణల అనంతరం 24 మందితో కూడిన టీటీడీ బోర్డు సభ్యుల జాబితాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. అన్ని సామాజిక వర్గాలకు, కోటాలకు సీఎం ప్రాధాన్యత కల్పించారు.

టీటీడీ పాలక మండలి ఇదే :

సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట ఎమ్మెల్యే)
పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం ఎమ్మెల్యే)
తిప్పేస్వామి (మడకశిర ఎమ్మెల్యే)
గడిరాజు వెంకట సుబ్బరాజు
నెరుసు నాగ సత్యం యాదవ్
శిద్ధా వీర వెంకట సుధీర్ కుమార్
యానాదయ్య
మాసీమ బాబు
ఎల్లారెడ్డిగారి సీతారామిరెడ్డి
పెనక శరత్ చంద్రారెడ్డి
అశ్వద్ధనాయక్
మేకా శేషుబాబు
రాంరెడ్డి సాముల
డాక్టర్ కేథన్ దేశాయ్
బాలసుబ్రమణియన్ పళనిస్వామి
ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డి
సుదర్శన్ వేణు
డాక్టర్ ఎస్.శంకర్
కృష్ణమూర్తి వైద్యనాథన్
ఆర్ వీ దేశ్‌పాండే
గడ్డం సీతా రంజిత్ రెడ్డి
అమోల్ కాలే
సౌరభ్ బోరా
మిలింద్ సర్వకర్‌