YS Jagan:జగన్ పెద్ద మనసు.. నాలుగేళ్లుగా పథకాలు అందుకోని వారికి లబ్ధి, 2.62 లక్షల మంది ఖాతాల్లోకి నగదు

  • IndiaGlitz, [Thursday,August 24 2023]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. అర్హత వుండి సంక్షేమ పథకాలను ప్రతిఫలాలను అందుకోలేకపోయిన 2 లక్షల 62 వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ ఈరోజు నగదు జమ చేశారు.2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్ల మందికి ప్రభుత్వం అందజేసింది. 1,49,875 మందికి పెన్షన్లు.. 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు.. 2,00,312 మందికి రేషన్ కార్డులు.. 12,069 మందికి ఇళ్ల పట్టాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడమని జగన్ అన్నారు. ఏదైనా కారణం వల్ల ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందని వారికి లబ్ధిచేకూర్చనున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. కుల, మత , ప్రాంతం , పార్టీ చూడకుండా పథకాలు అందిస్తున్నామని చెప్పారు . కొత్త పెన్షన్లతో కలిపి మొత్తం సంఖ్య 64 లక్షల 27 వేలకు చేరుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వం రూ.1000 ఇచ్చిన పెన్షన్‌ను తమ ప్రభుత్వం రూ.2,750కి పెంచిందన్నారు. అలాగే జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజలకు మంచి చేసేందుకు నాలుగు అడుగులు ముందుకేసి .. దానిని నిలబెట్టుకుంటూ పలు కారణాల వల్ల పథకాల అందుకోలేకపోయిన వారికి లబ్ధి కలిగిస్తున్నామని జగన్ చెప్పారు.

More News

Chandrayaan-3:చరిత్ర సృష్టించిన ఇస్రో .. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ సేఫ్ ల్యాండింగ్, జయహో భారత్ అంటోన్న ప్రపంచం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) చరిత్ర సృష్టించింది. అమెరికా, రష్యా, చైనా వంటి అగ్రదేశాలకే క్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండర్‌ను దించింది.

హరీశ్‌రావు‌పై వ్యాఖ్యలు.. మైనంపల్లిపై చర్యలకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధం, మల్కాజిగిరికి మరొకరు..?

బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్‌రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనకు, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని..

Akira: అకీరా ఎంట్రీపై ట్రోలింగ్ .. కష్టపడనిదే ఏది రాదు : ఇచ్చిపడేసిన రేణూ దేశాయ్

తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ కుటుంబంలో లేనంత మంది హీరోలు మెగా ఫ్యామిలీలో వున్నారు. తొలుత చిరంజీవి ఆయన అడుగుజాడల్లో నాగబాబు, పవన్ కల్యాణ్‌లు ఎంట్రీ ఇచ్చారు.

Chandrayaan 3: నేడే చంద్రయాన్-3 ల్యాండింగ్.. ఊపిరిబిగబెట్టి చూస్తోన్న ప్రపంచం, భారత్‌లో ఉద్విగ్న వాతావరణం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కీలక ఘట్టానికి చేరుకుంది. దాదాపు 41 రోజుల ప్రయాణం తర్వాత జాబిల్లిపై దిగేందుకు సిద్ధమైంది. ఇస్రోకు సమాంతరంగా రష్యా కూడా

Megastar Chiranjeevi:హ్యాపీ బర్త్ డే టూ మెగాస్టార్ : చిరు నెక్ట్స్ మూవీస్ ఇవే.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జోనర్‌లో

మెగాస్టార్ చిరంజీవి ఈరోజు తన 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.