'భాగ‌మ‌తి' స‌బ్జెక్ట్ ఏమిటంటే..?

  • IndiaGlitz, [Tuesday,December 26 2017]

అరుంధ‌తి, పంచాక్ష‌రి, రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరో.. ఇలా ఈ త‌రంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్‌లా నిలిచిన క‌థానాయిక అనుష్క శెట్టి. ఇటీవ‌ల బాహుబ‌లి2లో దేవ‌సేన‌గా అల‌రించిన అనుష్క‌.. ప్ర‌స్తుతం భాగ‌మ‌తి చిత్రంతో బిజీగా ఉంది. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేష‌న్స్ నిర్మిస్తోంది.

రూ.40 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. టీజ‌ర్ చూసిన వాళ్లంతా అరుంధ‌తి త‌ర‌హాలో ఈ సినిమా కూడా హార‌ర్ థ్రిల్ల‌ర్ అని అనుకుంటున్నారు.

అయితే విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. భాగ‌మ‌తి ఓ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ అని తెలిసింది. 500 ఏళ్ల క్రితం జ‌రిగిన ఓ ఘట‌న‌కి స‌మ‌కాలీన ప‌రిస్థితుల‌ నేప‌థ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార‌ట‌. టీజ‌ర్‌లో చూపించిన పాడుబ‌డిన కోట.. క‌థ‌లో కీల‌క‌మైన అంశ‌మ‌ని తెలిసింది.

ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో తెలుసుకోవాలంటే జ‌న‌వ‌రి 26 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

More News

మార్చి నుండి సినిమా థియేటర్స్ బంద్...

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో డిజిటల్ మరియు థియేటర్స్ లీజ్ విధానం పైన మార్చి 31 లోపులో

రెబల్ స్టార్ కృష్ణం రాజు చేతుల మీదుగా 'సినీ స్వర్ణ యుగంలో సారథి' పుస్తకం ఆవిష్కరణ

ప్రముఖ చలన చిత్ర సీనియర్ నటులు శ్రీ కె.జె సారధి పై రచయిత,చిత్రకారుడు రాంపా 'సినీ స్వర్ణ యుగంలో సారథి' టైటిల్ తో

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ 2017

1997లో  'పెళ్ళి పందిరి' చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ సాధించిన దిల్‌రాజు..2002లో దిల్‌ చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌ను సాధించారు. ఒక పక్క నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న దిల్‌రాజు 2017లో తన వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆరు విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి డబుల్‌ హ్యాట్రిక్‌ నిర్మాత అయ్యారు.

రామ్ స్టోరీ లైన్ ఎంటంటే...

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇప్పుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే

రియల్ పాత్రలో...

చెలియా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన హైదరాబాదీ అదితిరావ్ హైదరీ..