చరణ్ మూవీలో చైతు హీరోయిన్..!

  • IndiaGlitz, [Friday,January 13 2017]

ధృవ చిత్రంతో స‌క్సెస్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీని సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందే భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. 1980 - 1990 మ‌ధ్య జ‌రిగే విభిన్న గ్రామీణ ప్రేమ‌క‌ధా చిత్రంగా ఈ సినిమాని సుకుమార్ తెర‌కెక్కించ‌నున్నారు.

ఇక ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న అ ఆ, ప్రేమ‌మ్, శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాల్లో న‌టించిన‌ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తుంది. ఈ విష‌యాన్ని అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేస్తూ...అంద‌రికీ భోగి పండ‌గ శుభాకాంక్ష‌లు. తెలుగులో నా నెక్ట్స్ మూవీ రామ్ చ‌ర‌ణ్, సుకుమార్ సినిమాలో చేస్తున్నాను. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది అంటూ ట్వీట్ చేసింది.

తెలుగులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కు ఇది బిగ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం.

More News

సంక్రాంతికి బేవర్స్ ఫస్ట్ లుక్

ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు సాంగ్స్ తో పాటు డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

నాగ్ మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారంటున్న నాని..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి బెంచ్ మార్క్ సెట్ చేసారని నాని అంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే... అందరూ బాగుండాలి..! అందరి సినిమాలు విజయం సాధించాలి అని కోరుకునే మంచి మనిషి కింగ్ నాగార్జున.

సాయిధరమ్ తేజ్ విన్నర్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్..!

సాయిధరమ్తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం విన్నర్. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మహేష్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డీటైల్స్..!

సూపర్ స్టార్ మహేష్ - క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లో దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

యాంకర్ తో రైటర్...

మనం సహా పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా వర్క్ చేసిన హర్షవర్ధన ఇప్పుడు దర్శకత్వం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతమయ్యాయి.