రామ్ హీరోయిన్స్ తో మెగా హీరో రొమాన్స్

  • IndiaGlitz, [Thursday,August 17 2017]

ఓ సినిమాలో యువ క‌థానాయ‌కుడు రామ్‌కి జోడీగా న‌టిస్తున్న ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు.. వేర్వేరు సినిమాల కోసం మెగా ఫ్యామిలీ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇంత‌కీ ఆ హీరోయిన్స్ ఎవ‌రంటే.. 'అఆ', 'ప్రేమ‌మ్‌', 'శత‌మానం భ‌వ‌తి' చిత్రాలతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. 'భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌', 'సోగ్గాడే చిన్ని నాయ‌నా'తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న లావ‌ణ్య త్రిపాఠి. ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ప్ర‌స్తుతం రామ్ హీరోగా తెర‌కెక్కుతున్న 'ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ'లో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

క‌ట్ చేస్తే.. వారం గ్యాప్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన‌ సాయిధ‌ర‌మ్ కొత్త చిత్రాల‌లో ఈ ఇద్ద‌రే హీరోయిన్స్‌. వి.వి.వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో సాయి న‌టిస్తున్న చిత్రంలో లావ‌ణ్య హీరోయిన్‌గా న‌టించ‌నుంటే.. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సాయి న‌టించ‌నున్న తాజా చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయికగా న‌టిస్తోంది. రామ్‌తో పాటు సాయిధ‌ర‌మ్ తేజ్ కి కూడా ఈ తాజా చిత్రాల ఫ‌లితాలు కీల‌కంగా మారిన నేప‌థ్యంలో ఈ ల‌క్కీ గ‌ర్ల్స్ వారికి ఏ మాత్రం క‌లిసొస్తారో అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

అప్పుడు అంజలి..ఇప్పుడు తాప్సీ..

హాస్యనటుడుగా తనదైన ముద్ర వేసిన శ్రీనివాసరెడ్డి..

గతేడాది తారక్.. వచ్చే ఏడాది పవన్..

ఎన్టీఆర్,ఏఎన్నార్,కృష్ణ,శోభన్ బాబు..ఇలా ఒక తరంలోని అగ్ర కథానాయకులంతా 200,

అలాంటి సినిమాలు దేవిశ్రీ ఖాతాలోకే..

కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా..వినడానికి బాగుంటాయి.ఫర్ ఎగ్జాంపుల్ యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ నే తీసుకుంటే..

మహేష్ బాలీవుడ్ ఎంట్రీ...

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం'స్పైడర్'.

చిరు చిత్రంలో తమిళనటుడు...

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరగుతున్నాయి.