మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Sunday,July 19 2020]

మరో వైసీపీ ఎమ్మెల్యేకు తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా.. కరోనా బారిన పడుతున్నారు. ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషా సహా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వీరంతా క్రమక్రమంగా కోలుకుంటున్నారు.

అయితే తాజాగా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా కరోనా బారిన పడుతోంది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, ఒక ఎమ్మార్వో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, పోలీస్ సిబ్బంది వైరస్ బారినపడ్డారు. కాగా.. ప్రస్తుతం శివకుమార్ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

More News

గోదావరి జిల్లాను కుదిపేస్తున్న కరోనా

కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో కర్నూలు జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదవుతూ వచ్చాయి.

‘పవర్‌స్టార్’ వేదికగా.. మరో సంచలనానికి తెరదీసిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరదీశారు. ఇప్పటి వరకూ ప్రపంచ సినీ చరిత్రలో లేని సరికొత్త విధానానికి వర్మ శ్రీకారం చుట్టబోతున్నారు.

కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

కరోనా వైరస్.. తెలంగాణ నెత్తిపై పెద్ద పిడుగే వేసింది. మాటల్లో చెప్పలేనంత అప్రదిష్టను తెచ్చిపెట్టింది.

ఏపీలో షాక్.. ఒక్కరోజే దాదాపు 4 వేల కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు షాక్ ఇచ్చాయి. 2500 కేసులు నమోదవుతుంటేనే జనం భయపడిపోతుంటే..

అది నాకే తెలుసు.. అందుకే నా బయోపిక్‌లో నేనే హీరో: సోనూసూద్

ఎవరి బయోపిక్‌లో వారే నటిస్తే.. ఆలోచనే వినూత్నంగా ఉంది కదా..