ఏపీలో మరో కొత్త పార్టీ..

  • IndiaGlitz, [Sunday,November 01 2020]

ఏపీలో మరో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆది నుంచి రెండు, మూడు కులాలు మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటూ.. ఆ కులాల వారికే పెద్ద పెద్ద పదవులన్నీ కట్టబెడుతూ వస్తున్నాయి. అతి పెద్ద ఓటు బ్యాంకు బీసీలదే అయినప్పటికీ వారెప్పుడూ రాజకీయ పరంగా వెనుకబడి ఉంటున్నారనడంలో సందేహం లేదు. బీసీలను రాజకీయ లబ్ధి కోసం.. ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప ఏ పార్టీ కూడా పెద్ద పీట వేసిందయితే నేటి వరకూ లేదు.

ఇక ఏపీ విషయానికి వస్తే ముఖ్యంగా రెండు సామాజిక వర్గాలదే అధికారమంతా.. ఎన్నికల్లో తలపడినా ఆ రెండు సామాజిక వర్గాల మధ్యే పోటీ ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇప్పటి వరకూ బీసీలను ప్రధాన ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతమున్న బీసీ జనాభాకు ప్రాతినిధ్యం వహించే పార్టీయే లేకపోవడం గమనార్హం. దీంతో ఆదివారం బీసీ సంక్షేమ సంఘాలు గుంటూరు సమావేశమై నూతన రాజకీయ ఏర్పాటుపై చర్చించాయి.

నేడు గుంటూరు ఏపీ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జి.శ్యామ్ ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత అల్మాన్ రాజు సహా 13 జిల్లాల నుంచి బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. పదవుల పేరుతో బీసీలను చీల్చి ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. బీసీలు అంతా ఏకతాటిపై ఉండేందుకే నూతన పార్టీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు నేతలు తెలిపారు.

More News

తెలుగు రాష్ట్రాల్లో తొలి అడుగు.. అక్కడ థియేటర్లు ఓపెన్..

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో సినిమా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే.

రజినీ సర్.. మీ ఆరోగ్యం, ఆనందం కంటే ఏదీ ముఖ్యం కాదు: కుష్బూ

ప్రముఖ కథానాయకుడు రజినీకాంత్ ఆరోగ్యంపై ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ స్పందించారు.

కిర్రాక్ ఫ్యాన్.. శ్రీకృష్ణుడిగా మహేష్ లుక్ అదుర్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ చాలా పెద్దది.

అమ్మ రాజశేఖర్, అవినాష్‌లను వాయించేసిన నోయెల్..

కులు మనాలి నుంచి హోస్ట్ నాగార్జున హెలికాఫ్టర్‌లో బయల్దేరుతున్న సీన్‌‌ను చూపించారు. మెగా పవర్ స్టార్ ‘రంగస్థలం’ సాంగ్‌తో షోను స్టార్ చేశారు.

నటుడు రాజశేఖర్ కోలుకుటున్నారు: డాక్టర్ రత్న కిషోర్

కరోనాతో బాధపడుతున్న హీరో రాజశేఖర్ క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు వెల్లడించారు.