తెలుగులోకి మ‌రో హార‌ర్ చిత్రం..

  • IndiaGlitz, [Tuesday,November 28 2017]

తెలుగులో హార‌ర్ చిత్రాలు, హార‌ర్ కామెడీ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న త‌రుణంలో త‌మిళం నుండి తెలుగులోకి ఓ హార‌ర్ చిత్రం రానుంది. వ‌డివుడియాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం 'పొట్టు'. భ‌ర‌త్‌, న‌మిత‌, సృష్టి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రంలో న‌మిత మాంత్రికురాలి పాత్ర‌లో క‌న‌ప‌డనుంది.

ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్ అధినేత ఎన్.కృష్ణారెడ్డి ఫ్యాన్సీరేటుకు ద‌క్కించుకున్నారని స‌మాచారం. విన‌ప‌డుతున్న వార్త‌లు ప్ర‌కారం అనువాద హ‌క్కులను కోటి రూపాయ‌ల‌కు ద‌క్కించుకున్నారట‌. ఎన్‌.కృష్ణారెడ్డి ఇప్ప‌టికే విక్ర‌మ్ 'ఇంకొక్క‌డు' సినిమాను తెలుగులో విడుద‌ల చేశారు.

ప్ర‌స్తుతం విజ‌య్ ఆంటోని న‌టించిన అన్న‌దొరై చిత్రాన్ని తెలుగులో 'ఇంద్ర‌సేన‌'గా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత పొట్టు సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా 'పొట్టు' సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌కు రానుంది.

More News

భాస్క‌ర్‌కు మ‌ళ్లీ అవ‌కాశం ఇస్తారా?

'బొమ్మ‌రిల్లు' సినిమాతో డైరెక్ట‌ర్ భాస్క‌ర్ పేరు మారు మోగిపోయింది. ఆ త‌ర్వాత భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'పరుగు' సినిమా కూడా మంచి విజ‌యాన్నే అందుకుంది.

మ‌ళ్లీ బిజీ అవుతున్న నిత్యా

నిత్యా మీన‌న్‌.. పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్ర‌లకు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌క్షిణాది హీరోయిన్ పేరిది. సౌత్ లోని నాలుగు భాష‌ల్లోనూ న‌టిగా త‌న ప్ర‌తిభ‌ని చాటిన ఈ ముద్దుగుమ్మ‌.. తెలుగులోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది.

'సాహో' బిజినెస్‌.. టాలీవుడ్ టాక్‌

ప్రభాస్ హీరోగా  తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైన‌ర్  'సాహో'.  శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేష్ విలన్ గా న‌టిస్తున్నాడు.

మోహన్ బాబు 'గాయత్రీ' షూటింగ్ లో విష్ణు మంచు, శ్రియ

డా. మోహన్ బాబు ప్రధాన పాత్రలో ‘గాయత్రీ’ అనే చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లోగోకు అనూహ్య స్పందన వచ్చింది.

జవాన్ ప్రీ రిలీజ్ టూర్ వివరాలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నచిత్రం జవాన్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.