ప్ర‌భాస్ సినిమాలో మ‌రో హీరోయిన్.. ఎగిరి గంతేస్తున్న యంగ్ బ్యూటీ

  • IndiaGlitz, [Friday,February 07 2020]

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. కానీ.. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ప్ర‌స్తుతం చేస్తోన్న సినిమాపై ప్ర‌భాస్ చాలా కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేసి న‌టిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పూజాహెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌నుంద‌ట‌. ఆమె ఎవ‌రో కాదు.. రిద్దికుమార్‌.  ఇది వ‌ర‌కు రాజ్‌త‌రుణ్‌తో ల‌వ‌ర్ సినిమాలో జ‌త క‌ట్టిన రిద్దికుమార్‌కు, ఆ సినిమా డిజాస‌ర్ట్ కావ‌డంతో నిరాశే ఎదురైంది. ఇలాంటి త‌రుణంలో ఏకంగా ప్ర‌భాస్ న‌టించే అవ‌కాశం ద‌క్క‌డంతో ఈ యంగ్ బ్యూటీతో ఆనందంతో ఎగిరి గంతేస్తుంద‌ట‌. గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై  భారీ బ‌డ్జెట్‌తో సినిమా నిర్మిత‌మ‌వుతోంది. ఇప్ప‌టికే మూడు షెడ్యూల్స్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్‌ను ఆస్ట్రియాలో జ‌రుపుకోనుంది.

More News

టీడీపీలో చీలిక రాబోతోంది: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలిక రాబోతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి ఎలా? : పవన్

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘కియా మోటార్స్‌’ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలిపోతుందంటూ సోషల్ మీడియాలో..

లోకేశ్‌కు షాకిచ్చిన జగన్ సర్కార్

టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌కు జగన్ సర్కారు షాకిచ్చింది. ఇప్పటి వరకూ లోకేశ్‌కు ఉన్న ‘వై’ కేటగిరీ భద్రతను తగ్గించింది.

హాజీపూర్ హత్యల కేసు: శ్రీనివాస్‌కు ఉరి శిక్ష

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన.. ఊహించుకోవడానికే భయపడేలా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం హాజీపూర్‌లో శ్రీనివాసరెడ్డి వరుస అత్యాచార ఘటనలకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఫోర్బ్స్ ఇండియా 30లో సాయిపల్లవి..

30 ఏళ్ల లోపు ఉన్న ఇండియన్ యూత్‌లో అత్యధిక సంపాదన కలిగిన 30 మంది జాబితాను ఇటీవలే ఫోర్బ్స్ విడుదల చేయడం జరిగింది.