ప‌వ‌న్ చిత్రంలో మ‌రో హీరోయిన్ కూడా ఖ‌రారైందా..?

  • IndiaGlitz, [Tuesday,November 03 2020]

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్‌ కోశియునుమ్‌' సినిమాకు ఇది రీమేక్ అనే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప‌వ‌న్‌తో న‌టించ‌బోయే మ‌రో హీరో ఎవ‌ర‌నే దానిపై సోష‌ల్ మీడియాలో చాలా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. రానా ద‌గ్గుబాటి, నితిన్ స‌హా క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమాలో న‌టించ‌బోయే హీరోయిన్స్ విష‌యంలోనూ ప‌లు ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. ఓ హీరోయిన్‌గా.. ప‌వ‌న్ జోడీ సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంద‌ని అంటున్నారు. కాగా, మ‌రో హీరోయిన్ పాత్ర‌లో ఐశ‌ర్యా రాజేష్ క‌నిపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. అంటే ప‌వ‌న్‌తో క‌లిసి న‌టించ‌బోయే మ‌రో హీరోకు జోడీ అనే టాక్ అయితే చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమాకు 'బిల్లా రంగా' అనే టైటిల్‌ పరిశీలనలో ఉందని కూడా అంటున్నారు. పొల్లాచ్చిల్లో సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేసేలా ప్లాన్‌ జరిగిపోయింది. వచ్చేఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్‌ అనుకుంటున్నారట.

More News

`రాధేశ్యామ్` నుండి తిరిగొచ్చేసిన పూజాహెగ్డే..

`రాధేశ్యామ్` నుండి పూజా హెగ్డే తిరిగొచ్చేసిందా! అంటే అవును నిజ‌మే అనాలి.

'ఆర్ఆర్ఆర్‌`లో జ‌లియ‌న్ వాలాభాగ్‌

జలియ‌న్ వాలాభాగ్ ఘ‌ట‌న అన‌గానే ఎవ‌రికైనా స్వాతంత్ర్యానికి ముందు జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ ప్ర‌జ‌ల‌పై అకృత్యంగా చేసిన కాల్పుల ఘ‌ట‌నే గుర్తుకు వ‌స్తుంది.

నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌..!

యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య కొత్త చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ లిస్టులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై

దేశ వ్యాప్తంగా 54 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్..

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ నేడు ప్రారంభమైంది. 10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతోంది.

ఆట మొదలైంది...

ఓపెనింగే అఖిల్‌తో మోనాల్ మీటింగ్. మోనాల్ కూర్చొని ఉంటే అవాయిడ్ చేశాడట. వచ్చి అడిగింది.