ద‌ర్శ‌కుడిగా మ‌రో హీరో...

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

రీసెంట్‌గా చిల‌సౌ సినిమాతో హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న బాట‌లోనే మ‌రో హీరో కూడా ద‌ర్శ‌క‌త్వం వైపు అడులేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ హీరో మ‌రెవ‌రో కాదు..సాయిరామ్ శంక‌ర్.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడైన సాయిరాం శంక‌ర్‌, త‌నే హీరోగా న‌టిస్తూ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌.

అల్రెడి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అనుభ‌వం, సినిమాల్లో న‌టించిన అనుభ‌వంతో రెండు బాధ్య‌త‌ల‌ను త‌నే నిర్వ‌హిస్తున్నాడ‌ని టాక్‌. హీరో అంతంత మాత్ర‌మే సినిమాలు చేస్తున్న సాయిరాం శంక‌ర్ ద‌ర్శ‌కత్వ శాఖలో ఏ మేర రాణిస్తాడో చూడాల్సిందే.