ర‌జ‌నీ చిత్రంలో మ‌రో బాలీవుడ్ విల‌న్‌?

  • IndiaGlitz, [Tuesday,April 10 2018]

సూపర్ స్టార్ రజనీ కాంత్, త‌మిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ విల‌క్ష‌ణ‌ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీని సంప్రదించారని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

'సర్ఫరోష్' (1999) చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన‌ నవాజుద్దిన్ సిద్ధిఖి.. 'క‌హానీ', 'తలాష్', 'ది లంచ్ బాక్స్', 'బ‌జరంగీ భాయిజాన్', 'మామ్' సినిమాలతో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

కాగా.. ఇప్పటికే రజనీ కాంత్ '2.O'లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తుండగా.. 'కాలా'లో విలన్‌గా మరో బాలీవుడ్ విల‌క్ష‌ణ నటుడు నానా పటేకర్ నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ న‌టుల‌నే ప్ర‌తినాయ‌కులుగా ఎంచుకోవ‌డం అనే విష‌యంలో.. శంకర్, పా.రంజిత్ బాటలోనే కార్తీక్ సుబ్బరాజ్ కూడా పయనిస్తున్నారన్న విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

More News

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రో ముగ్గురు హీరోలు?

మహానటుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా 'యన్.టి.ఆర్' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ బ‌యోపిక్‌ను నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.

నితిన్‌కు మూడోసారి వ‌ర్క‌వుట్ కాలేదు?

యువ క‌థానాయ‌కుడు నితిన్‌కు క‌లిసొచ్చిన నెలల్లో ఏప్రిల్ నెల‌కు ప్ర‌త్యేక స్థాన‌ముంది. ఎందుకంటే.. గ‌తంలో ఇదే నెల‌లో నితిన్ హీరోగా న‌టించిన రెండు చిత్రాలు విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి.

గోపీచంద్‌కు ఆ తేది మ‌రోసారి క‌లిసొస్తుందా?

యాక్షన్ చిత్రాల క‌థానాయ‌కుడు గోపీచంద్ న‌టిస్తున్న 25వ చిత్రం 'పంతం'. మెహరీన్ నాయిక‌. ఈ చిత్రంతో కె.చక్రవర్తి (చక్రి) దర్శకుడిగా పరిచయం కానున్నారు.

న‌రేష్ సినిమాలో పూర్ణ.. అయితే..?

సీమ ట‌పాకాయ్ అనే సినిమాలో అల్ల‌రి న‌రేశ్‌, పూర్ణ జ‌త‌గా న‌టించారు. ఇప్పుడు మ‌రోసారి అల్ల‌రి న‌రేశ్ సినిమాలో పూర్ణ న‌టించ‌నుంది.

నాగ‌శౌర్య చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

'ఛలో' విజ‌యం యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త‌రువాత త‌దుప‌రి ప్రాజెక్టుల