అంకిత నాపై నిర్మాతకు ఫిర్యాదు చేసింది: నవదీప్

  • IndiaGlitz, [Thursday,November 05 2020]

‘జై’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. హీరో పాత్రలే కాకుండా అందివచ్చిన అవకాశాన్ని పట్టుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవదీప్. ‘చందమామ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా బుల్లితెరపై కూడా రాణిస్తున్నాడు. కాగా.. అప్పట్లో నవదీప్‌కి హీరోయిన్ అంకితతో గొడవలున్నాయంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఓ షోలో నవదీప్ స్పందించాడు. వారిద్దరి మధ్య అసలేం జరిగిందో వెల్లడించాడు.

అంకితతో సినిమా చేసే నాటికి ఆమె రెండు హిట్లు కొట్టిన హీరోయిన్ అని.. తనేమో ఫ్లాప్ సినిమా హీరోనని నవదీప్ చెప్పాడు. దీంతో తను డేట్లు మార్చి ఇవ్వడమే కాకుండా తమ కోసమే డేట్లు అడ్జెస్ట్ చేస్తున్నాననే ఫీలింగ్‌లో ఉండేదని నవదీప్ వెల్లడించాడు. సినిమాలో చివరి రెండు సాంగ్స్ షూటింగ్ చేయాల్సి ఉందని ఆ సమయంలో అంకితను రావాలని పిలిస్తే రానని చెప్పిందని నవదీప్ తెలిపాడు. దీంతో అగ్రిమెంట్ చూపించి ఆమెను చిత్రబృందం రప్పించాల్సి వచ్చిందన్నారు. నిర్మాతపై గొడవ కావడంతో ఆ కోపాన్ని తనపై కూడా చూపించిందని వెల్లడించాడు.

తను జోకులు చేస్తున్నానంటూ అంకిత.. నిర్మాతకు ఫిర్యాదు చేసిందన్నాడు. తద్వారా షూటింగ్‌ను ఆపేయాలని ప్లాన్ చేసిందని నవదీప్ వెల్లడించాడు. తర్వాత తామిద్దరం కూర్చొని మాట్లాడుకుని మ్యాటర్ సెటిల్ చేసుకున్నామని వెల్లడించాడు. అంతా హ్యాపీ అనుకున్న సమయంలో ఒక రిపోర్టర్ ఫోన్ చేసి మీతో గొడవల కారణంగానే అంకిత నిద్ర మాత్రలు మింగిందట కదా అని ప్రశ్నించడంతో షాక్ అయ్యానని నవదీప్ వెల్లడించాడు. తాను కూడా షాకయ్యానని.. ఆ వార్తలు విని.. తమ ఇంట్లో వాళ్లు కంగారు పడ్డారన్నారు. తరువాత ప్రెస్ మీట్ పెట్టి నిజం చెప్పానని.. ఈ విషయంలో తనకు నాగబాబు బాగా సాయం చేశారని నవదీప్ వెల్లడించాడు.

More News

విజయానికి ఆరు ఓట్ల దూరంలో బైడెన్...

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీకి తెరపడే సమయం ఆసన్నమవుతోంది.

మాదాపూర్ టు మియాపూర్.. మెట్రోలో ప్రయాణించిన పవన్

జనసేన అధ్యక్షులు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేడు మెట్రోలో ప్రయాణించడం ఆసక్తికరంగా మారింది.

బోరింగ్ టాస్క్.. విసుగు తెప్పించిన షో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘రంగస్థలం’టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్. ‘పల్లెకు పోదాం చలో చలో’.

అర్నబ్ అరెస్ట్.. సోషల్ మీడియా ఫైర్..

2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు రిపబ్లిక్ న్యూస్ ఛానెల్ చీఫ్ ఎడిటర్ అర్ణబ్‌ గోస్వామి అరెస్ట్ చేశారు.

మెగా డాటర్ నిహారిక వివాహ తేదీ ఫిక్స్...

కరోనా మహమ్మారి... ఇప్పట్లో కంట్రల్‌లోకి వచ్చే సూచనలైతే కనిపించట్లేదు. దీంతో టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు.