వంశీ పైడిప‌ల్లి బాట‌లోనే అనిల్ రావిపూడి

  • IndiaGlitz, [Monday,June 25 2018]

తెలుగు ప్రేక్షకులకు దూరమైపోయిన‌ మల్టీస్టారర్ చిత్రాలను మళ్ళీ 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో గుర్తు చేసారు టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు. టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా కనిపించిన ఈ సినిమా మళ్ళీ తెలుగులో మల్టీస్టారర్ మూవీలు రూపుదిద్దుకోవ‌డానికి ఊపిరి పోసింది. అలాగే.. ఇదే బ్యానర్‌పై మరో మెగా మల్టీస్టారర్ మూవీని కూడా నిర్మించారు 'దిల్' రాజు.

'దిల్' రాజు నిర్మాణంలో వ‌రుస‌గా 'మున్నా', 'బృందావనం' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి.. తన మూడో చిత్రంగా ఈ మల్టీస్టారర్ మూవీని డైరెక్ట్ చేసారు. వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ 'ఎవడు' మూవీలో మెగా హీరోస్ అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి స్క్రీన్‌ను పంచుకున్న విష‌యం తెలిసిందే.

కట్ చేస్తే.. వంశీ లాంటి అవకాశాన్ని మరో యంగ్ డైరెక్టర్‌కి కూడా ఇచ్చారు 'దిల్' రాజు. తన నిర్మాణంలో వ‌రుస‌గా 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' సినిమాలను తెరకెక్కించిన అనిల్ రావిపూడితో థ‌ర్డ్ ఫిల్మ్‌గా మల్టీస్టారర్ మూవీ 'ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్'ని నిర్మిస్తున్నారు రాజు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న ఈ చిత్రం జూలై 5 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. కాగా.. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదల కానుంది.

మరి వంశీ లాగే అందివ‌చ్చిన అవకాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని.. అనిల్ త‌న ఖాతాలో మ‌రో విజయాన్ని వేసుకుంటారేమో చూడాలి.

More News

జెన్యూన్ హిట్ గా 'టిక్ టిక్ టిక్'

ఇండియన్ సినిమా చరిత్రలొనె తొలి స్పెస్ మూవీగా తెరకెక్కిన చిత్రం టిక్ టిక్ టిక్. గత శక్రవారం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. జయం రవి హీరోగా తెలుగులో తొలి సక్సెస్ ను అందుకున్నారు‌

'పంతం' లాంటి సోష‌ల్ కాజ్ ఉన్న మూవీని నా 25వ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది - గోపీచంద్‌

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.

రాజ్ త‌రుణ్ 'ల‌వ‌ర్‌' ఆడియో ఆవిష్క‌ర‌ణ

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల‌'తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు.

సుమంత్ 'ఇదం జగత్' ఫస్ట్ లుక్ విడుదల

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'ఇదం జగత్'.

ప్ర‌భాస్.. ప‌దేళ్ళ త‌రువాత‌

బాహుబ‌లి సిరీస్‌తో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్‌.