నాగ్ యాక్షన్ థ్రిల్లర్‌లో అవకాశం కొట్టేసిన అనిక సురేంద్రన్..

  • IndiaGlitz, [Tuesday,February 09 2021]

తమిళ్, మలయాళ చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన అనికా సురేంద్రన్ ఇప్పుడు తెలుగులో అద్భుతమైన అవకాశం దక్కించుకుంది. ‘క్వీన్’ వెబ్ సిరీస్ ద్వారా ఈ అమ్మడు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారైంది. ఇప్పటి వరకూ దాదాపు చైల్డ్ ఆర్టిస్టుగానే నటించిన తాజాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌లో అవకాశం దక్కించుకుంది. ‘క్వీన్’ చూసిన తరువాత అనికను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నట్టు ప్రవీణ్ సత్తారు వెల్లడించారు.

లుక్ టెస్ట్ చేసిన అనంతరం తన సినిమాలో నటించేందుకు అనిక పర్ఫెక్ట్ అని ప్రవీణ్ సత్తారు డిసైడ్ అయ్యారు. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ సెట్స్‌లో అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది. తమిళ్, మలయాళంలో అనిక సాఫ్ట్ రోల్స్‌లో మాత్రమే నటించింది. నాగ్ సినిమాలో ఆమె పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఎన్నై అరింధాల్‌, విశ్వాసం చిత్రాల్లో బాల‌న‌టిగా అనిక సురేంద్ర‌న్ అద్భుతంగా నటించింది‌. చైల్డ్ ఆర్టిస్టుగా కేర‌ళ రాష్ట్రం నుంచి చాలా అవార్డులు అందుకుంది.

ఇపుడు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు రెడీ అవుతోంది. అనిక మలయాళం అమ్మాయి అయినప్పటికీ అచ్చం తెలుగింటి అమ్మాయిలాగే కనిపిస్తుంది. 2007 లో ఒక మలయాళం సినిమాతో అనిక తన కెరీర్‌ను మొదలు పెట్టింది. 2015 లో తమిళ్ స్టార్ అజిత్ హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎంతవాడుకాని సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మళ్ళీ అజిత్ తోనే విశ్వాసం సినిమాలో నటించిన అనిక సురేంద్రన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుసగా ఆఫర్లు వచ్చిపడ్డాయి. తాజాగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు అనిక సిద్ధమవుతోంది.

More News

ఎర్రకోట ఘటన: దీప్ సిద్దూ అరెస్ట్

పంజాబ్ ప్రముఖ నటుడు, గాయకుడు, యాక్టివిస్టు దీప్ సిద్ధూను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

అటు ఈటల.. ఇటు షర్మిల తెలంగాణలో ఏం జరుగుతోంది?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకూ మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ వ్యతిరేక గాలులు బలంగా వీస్తున్నాయి.

షాకింగ్ న్యూస్ చెప్పి అభిమానుల సాయం కోరిన కాజల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అభిమానులకు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అలాగే ఆమె ఒక మెసేజ్ కూడా ఇచ్చారు.

చైత‌న్య డిజిటల్ ఎంట్రీ..?

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా సాయిప‌ల్ల‌వితో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ‘ల‌వ్‌స్టోరి’ ఏప్రిల్ 16న విడుద‌ల కానుంది.

త‌లైవా 169 ఫిక్స్‌..!

త‌లైవా ర‌జినీకాంత్ రాజ‌కీయాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో రాజ‌కీయాల‌కు తాను దూరం అనే విష‌యాన్ని ఆయ‌న ప్ర‌క‌టించేశాడు.